ప్రస్తుతం ప్రపంచంలో కరోనా వైరస్ ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.దీన్ని నివారించడానికి ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పటికే లాక్ డౌన్ విధానాన్ని అమలు చేశాయి.
లాక్ డౌన్ విధించినప్పుడు నుండి జనాలు ఇంటికి పరిమితం అయ్యారు.బయటికి వస్తే ఎక్కడ కరోనా వస్తుందన్న భయంతో చాలా వరకు ఇంట్లోనే ఉన్నారు.
కానీ కొందరు మాత్రం ఇలాంటివి లెక్కచేయకుండా బయట ఇష్టానుసారంగా తిరుగుతూ కరోనా వ్యాప్తికి దోహదం చేస్తున్నారు.
ఇక ఇంట్లో ఉంటూ జీవనం కొనసాగిస్తున్న చాలామంది ఇంటర్నెట్ వాడకం బాగా పెంచేశారు.
వారు వారి కుటుంబ సభ్యులు ఎంత టైం కావడానికి సోషల్ మీడియా లో ఎన్నో ఆటల పోటీలు తెగ వాడేస్తున్నారు.అంతేకాదు ఈ మధ్య కాలంలో టిక్ టాక్ నిలిపివేయడంతో మిగతా విషయాల పై వెదకడం మొదలు పెట్టారు నెటిజెన్స్.
అయితే ఇప్పుడు తాజాగా ఓ ఫోటో ట్రెండింగ్ చాలెంజ్ గా మారింది.మామూలుగా మనం చిరుత, జాగ్వర్, చితా లాంటి వివిధ పేర్లను వింటూ ఉంటాము.నిజానికి చూడడానికి అవి ఒకేలా ఉంటాయి కానీ, అవి వేరు.
ఈ క్రమంలోనే ఓ ఐఎఫ్ఎస్ అధికారి సరికొత్త ఛాలెంజ్ ను సోషల్ మీడియాలో నెటిజెన్స్ ముందుకు తీసుకువచ్చారు.అదేమిటంటే ముఖం కనిపించకుండా తీసిన రెండు పులుల ఫోటోస్ ను ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు.ఇక దానికి ఆ రెండిటిలో ” ఏది చిరుత, ఏది జాగ్వార్ “ అంటూ ప్రశ్నించాడు.
దీంతో పాటు ఆయన ముఖం చూడకుండా కేవలం వాటి శరీరం మీద ఉన్న మచ్చల ఆధారంగానే తాము వాటి మధ్య తేడాను గుర్తించగలమని తెలిపాడు.అయితే మీరు ఇందులో ఏది చిరుత ఏది జాగ్వర్ కనుక్కోండి అంటూ ఫోటో ని జత చేశారు.
ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసి ఏదో తేల్చండి.