పుర్రెకో బుద్ధి, జిహ్వాకో రుచి అని ఊరికే అనలేరు పెద్దలు.ఎవరి బుద్ధి ఎలా ఉంటుందో ఎవరమూ చెప్పలేం కదా.
మారుతున్న కాలానికి తగ్గట్లు ప్రజల్లో కూడా అనేక మార్పులు వస్తున్నాయి.ప్రతి చిన్న విషయాన్ని కూడా స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నారు.
అందరిలా ఉంటే స్పెషల్ ఏముంటుంది అనుకుంటున్నారో ఏమోగానీ వారు చేస్తున్న పనులు మాత్రం ఎవరి ఊహకు కూడా అందట్లేదు.ఇప్పుడు కూడా ఇలాంటి విచిత్రమే జరిగింది.
అందరిలాగా కాకుండా డిఫరెంట్ గా చేయాలనుకుని చివరకు ఇబ్బందుల్లో పడ్డారు.
పెండ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన వేడుక.
అందుకే జంటలు ఈ వేడుకను సెలబ్రేట్ చేసుకునేందుకు చాలా ప్లాన్లు వేసుకుంటాయి.ఇందుకు తగ్గట్టు ఈవెంట్ ఆర్గనైజర్లు కూడా చాలా వెరైటీలు ప్లాన్ చేస్తున్నాయి.
కట్టుకునే బట్టల దగ్గరి నుంచి మంటపానికి వచ్చే విధానం దాకా మొత్తం డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నాయి.అయితే ఇలా ప్లాన్ చేసే వాటిల్లో కిన్ని బోల్తా కొడుతున్నాయి.
ప్రస్తుతం ఇలాంటి వీడియోనే నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.ఇందులో ఓ జంట మంటపానికి ఏకంగా క్రేన్ బకెట్లో వచ్చేందుకు ప్లాన్ చేసుకుంది.
ఇక పెద్ద ఫంక్షన్ హాల్ లో అందరూ అందంగా చూస్తుండగానే వధూవరులను క్రేన్ బకెట్ మోసుకెళ్తోంది.ఇలా వెళ్తున్న క్రమంలో ఇద్దరూ చాలా సంతోషంగా కనిపిస్తున్నారు.అయితే ఇంతలోనే ఊహించన ఘటన జరిగింది.క్రేన్ బకెట్ సడెన్ గా కిందికి పడిపోయినట్టు వంగింది.దీంతో అందులో కూర్చున్న ఇద్దరు వధువు, వరుడు కింద పడిపోయారు.ఈ షాకింగ్ ట్విస్టుతో అందరూ ఆశ్చర్యపోయారు.
వెంటనే తేరుకుని వారిద్దరినీ లేపి కూర్చోబెట్టారు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
.