అమ్మాయికి ఇష్టంలేని పెండ్లి చేస్తే ఏమవుతుంది.కొందరు ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల కోసమైనా భరిస్తూ కాపురం చేస్తారు.
మరి కొందరు మాత్రం తెగించి తమకు నచ్చిన వాడితో వెళ్లిపోతున్న ఘటనలు కూడా మనం చూస్తూనే ఉన్నాం.అయితే ఇలా వెళ్లిపోవడానికి బలమైన కారణాల ఉంటాయన్న విషయం కూడా విదితమే.
పెళ్లైన పది రోజులకే ఓ అమ్మాయి పారిపోయిన ఘటన ఇప్పుడు రాజస్థాన్ లో జరిగింది.ఇది కూడా మామూలు ఘటనే అనుకోవచ్చు.
కానీ ఇక్కడే అసలు విషయం వేరే ఉంది.ఇది ఎవరి ఊహకు అందనటువటి కొత్త కోణం.
రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్ పుర్ ప్రాంతంలో ఓ అమ్మాయికి కొత్తగా పెళ్లైంది.ఇక అత్తారింటికి వెల్లిన ఆ అమ్మాయి కేవలం పది రోజులకే అ్తతింటి వారికి తినే ఆహారంలో మత్తుమందు ఇచ్చి ఇంటి నుంచి పారిపోయింది.
ఇక మత్తు మందుకు అత్తింటి వారి ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా మారడంతో స్థానికులు వారిని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లారు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పెళ్లి కుమార్తె కోసం వెతకటం స్టార్ట్ చేశారు.
కాగా వారికి ఓ పెట్రోల్ బంకు దగ్గర కనిపించిన వధువును ప్రవ్నించగా విస్తుపోయే విషయాలు చెప్పింది.
తమది బిహార్ అని, తల్లిదండ్రులు కడు బీదవారు కావడంతో తనను రాజస్థాన్ వారికి అమ్మేశారని వెల్లడించింది.అంతే కాదు తన భర్త నిత్యం మద్యం తాగుతూ తనను నానా హింసలు పెడుతున్నాడని వేరే దారి లేక చివరకు ఇలా పారిపోయినట్లు ఆమె చెప్పింది.దీనిపై క్రాస్ చెక్ చేసిన పోలీసులకు ఇదంతా నిజమని తేలియడంతో అత్తారింటి వారిని అదుపులోకి విచారిస్తున్నారు.
కాగా అటు తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు.ఈ ఘటన ఇప్పుడు రాజస్థాన్లో పెను సంచలనం రేపుతోంది.