అమెరికాలో ఒకే కుటుంభంలో జరిగిన ఆరుగురి హత్య స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.సహజంగా హత్యలు జరగడం వెనుక ఏదో ఒక కుట్ర కోణం ఉంటుంది, లేదంటే పగలు ప్రతీకారాల నేపధ్యంలో అయిన హత్యలు జరుగుతాయి.
కానీ ఒక కుటుంభంలో ఇద్దరు అన్న దమ్ములు వారి కుటుంభ సభ్యులను చంపమని, తమని కూడా చంపమని ఒప్పందం కుదుర్చుకోవడంతో ఈ డెత్ లు మిస్టరీగా మారుతున్నాయి.అసలు ఇలా ఎందుకు చేశారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఈ కేసును పరిశోధిస్తున్న జోన్ ఫెల్తి తెలిపిన వివరాల ప్రకారం.
అమెరికాలోని డల్లాస్ లో సబర్బన్ లోని ఓ ఇంట్లో ఆరుగురు చనిపోయినట్టుగా గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
దాంతో హుటాహుటిన వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు.హత్యకు కుట్ర ఎలా జరిగి ఉంటుందని భావించిన అధికారులు హత్య జరిగిన తీరును బట్టి కుటుంభంలోని ఇద్దరు సోదరుల సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించారు.
అందులో ఓ సోదరుడి ఇన్స్టా గ్రామ్ ఖాతాలో తాను, అతడి సోదరుడు, చనిపోనున్నట్టు, అంతకంటే ముందుగా తమ కుటుంభ సభ్యులను చంపడానికి ప్రణాళిక చేస్తున్నట్టుగా తెలిపాడు.
ఈ హత్యలలో హత్య- ఆత్మహత్య కుట్ర రెండు అంశాలు ఉన్నాయని తెలిపారు పోలీసులు.
సోదరులు తన్వీర్, పర్హాన్ లు ఇద్దరు తమను తాము చంపుకుని, కుటుంభాన్ని కూడా చంపడం వెనుక ఎవరు కుట్ర అయినా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు.చనిపోయిన వారిలో సోదరుల బామ్మ అల్తాపున్ నెస్సా 77 ఏళ్ళు , తల్లి తండ్రులు ఇరెన్ ఇస్లాం 56 ఏళ్ళు, తల్లి తోహిదుల్ ఇస్లామ్ 54 ఏళ్ళు మరియు సోదరి ఫర్బిన్ 19 ఏళ్ళుగా నిర్ధారించారు పోలీసులు.
వీరి కుటుంభం బంగ్లాదేశ్ నుంచీ వలస వచ్చి డల్లాస్ లో స్థిరపడిందని, ఎంతో సంతోషంగా ఉండే కుటుంభంలో ఇలాంటి ఘటన జరగడంతో షాక్ అయ్యామని చుట్టుపక్కల వారు తెలిపారు.స్థానికంగా ఉండే బంగ్లాదేశ్ కు చెందిన కమ్యూనిటీ ఘటనా స్థలానికి వచ్చారు.
ఎంతో మంచి కుటుంభంలో ఇలాంటి ఘోరం జరుగుతుందని అనుకోలేదని కన్నీటి పర్యంతమయ్యారు.