కంబోడియా దేశంలో చిట్టెలుక అత్యంత గౌరవానికి అర్హత సంపాదించింది.అంతేకాదు అరుదైన గౌరవాన్ని కూడా అందిపుచ్చుకుంది.
అంతే కాదు ఈ సందర్భంగా గోల్డ్ మెడల్ ను సాధించింది.ఇక ఈ పథకం పేరు చూస్తే పిడిఎస్ఏ గోల్డ్ మెడల్.
అయితే ఈ మెడల్ ఇంతవరకు 30 జంతువులకు ఇచ్చారు.అయితే మొట్టమొదటిసారిగా ఎలుక ఈ అవార్డును గెలుచుకుంది.
ఎలుక జాతిలోనే ఈ ఎలక ఓ ఆణిముత్యంలా నిలిచి చరిత్ర సృష్టించిందని నెటిజన్ కామెంట్ చేస్తున్నారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే…
ఆ ఎలుక పేరు ‘మగావా’.
ఇంతకూ ఈ మెడల్ ను ఆ ఎలుక ఎందుకు బహుకరించారో అని ఇప్పటికే మీకు ఓ డౌట్ వచ్చి ఉంటుంది.అసలు ఈ ఎలుకకు ఈ బంగారు పతకం ఎందుకు ఇచ్చారంటే ఎలుక పోలీస్ జాగిలాల వలె అక్కడ పని చేస్తోంది.
ఆఫ్రికా ప్రాంతానికి చెందిన ఈ ఎలుక కాంబోడియా భూముల్లో పాతిపెట్టిన ల్యాండ్ మైండ్ ను కనిపెట్టడంలో ఈ ఎలుక ఎంతగానో ప్రతిభ చూపించింది.అది ఎంతలా అంటే గత ఏడు సంవత్సరాల్లో ఈ ఎలుక వల్ల ఏకంగా 39 ల్యాండ్ మైండ్స్, అలాగే 28 పేలుడు పదార్థాలను అధికారులు కనిపెట్టారు.
దీంతో మనుషుల ప్రాణాలను కాపాడటంలో ఎంతో ప్రముఖ పాత్ర వహించిన ఈ మగావా కు ఈ అరుదైన గౌరవం లభించింది.అయితే ఈ ఎలుకకు బెల్జియం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ల్యాండ్ మైన్ ఎలా కనిపెట్టాలి అన్న విషయంపై అధికారులు ట్రైనింగ్ ఇచ్చారు.
ఈ ఎలుక ట్రైనింగ్ లో జాయిన్ అయినప్పుడు నుంచి చాలా చురుగ్గా ఉందని, అలా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత డ్యూటీలో జాయిన్ అయి చివరికి ఇలా గోల్డ్ మెడల్ ని కూడా సాధించిందని అధికారులు తెలియజేశారు.ప్రస్తుతం ఈ ఎలుక వయస్సు ఏడు సంవత్సరాలు.
ఎంతోమంది ప్రాణాలను కాపాడడానికి కారకురాలైన ఈ ఎలుక సేవలను గుర్తించిన ప్రభుత్వం చివరకు బంగారు పథకంతో అభినందించారు.ఇకపోతే 1990 సంవత్సరం నుండి బెల్జియం దేశానికి చెందిన అపోపో సంస్థ ఎలుకలకు ట్రైన్ చేస్తూ వస్తోంది.