తల్లిదండ్రులంటే పిల్లలకు ఆదర్శంగా ఉండాలి.వారికి ఆస్తులు సంపాదించి పెట్టకపోయినా బాధ్యత నేర్పాలి, విలువలతో కూడిన జీవితాన్ని అలవాటు చేయాలి.
ప్రస్తుత కాలంలో కొందరైతే తమ పిల్లలు ఎన్ని తప్పులు చేస్తున్నా సమర్ధిస్తున్నారే గానీ, వాటిని సరిచేసి పిల్లల జీవితాలు సరైన దారిలో పెట్టడానికి ప్రయత్నించక పోవడం దురదృష్టం.
ఇకపోతే ఒక తల్లి కూడా కొడుకు చేసిన అప్పులు తీర్చడం కోసం మోసాలకు తెగబడింది.
ఆ మహిళ చేసిన పని తెలిసిన వారు ఇలాంటి తల్లులు ఉంటే సమాజమే సంకనాకి పోతుందంటున్నారు.ఇక ఆ తల్లి చేసిన ఘనకార్యాన్ని తెలుసుకుంటే.
ముంబైలో ములంద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న రూపాల్ పాండ్య అనే మహిళ కుమారుడు దుబాయ్లో ఉంటున్నాడట.జూదం అలవాటున్న ఇతను ఓ క్యాషినోలో ఈ ఆట ఆడి 2 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడట.
ఈ విషయం తెలిసిన అతని తల్లి అడ్దదార్లు తొక్కి, తాను ఉపాధి పొందుతున్న బ్యూటీ పార్లర్ కు వచ్చే, కస్టమర్లు, పరిచయస్తుల దగ్గర ఎక్కువ వడ్డీ ఇస్తానంటూ అప్పులు చేసిందట.ఇలా సుమారుగా 2 కోట్ల రూపాయలు జమచేసి కొడుకు అప్పు తీర్చిందట.
ఇక అప్పు ఇచ్చిన వారికి పెట్టిన గడువు ముగియడం తో వారంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటకు పొక్కిందట.చూశారా ఇలాంటి తల్లులున్న కొడుకులు జీవితంలో బాగుపడతారా.?
.