అసలే కష్టకాలంలో ఉన్న తెరాసకు తమ స్వంత పార్టీ నేతల వ్యవహారంతో పార్టీకి తలనొప్పిగా మారింది.అసలే బీజేపీపై పెద్ద ఎత్తున మాటల తూటాలు పేలుస్తూ రోజురోజుకు బలంగా తయారవుతోంది.
ఇప్పటికీ బీజేపీ చేసిన ఏ విమర్శపై స్పందించని కేసీఆర్ ఇప్పుడు స్వంత పార్టీ నేతల వ్యాఖ్యల వల్ల ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.తాజాగా గంగ పుత్రులపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి.
తరువాత గంగపుత్రులు పెద్దఎత్తున ఆందోళనలు చేయడం జరిగింది.ఈ ఆందోళనలతో చివరికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరల తాజాగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు బీజేపీ మరియు రామ జన్మభూమి నిధి సేకరణపై చేసిన వ్యాఖ్యలు పెద్ద రచ్చగా మారాయి.బీజేపీ బిక్షగాళ్లలాగా నిధి సేకరణ చేస్తునారని, అయోధ్య రామాలయ నిర్మాణానికి విరాళాలు ఇవ్వకూడదని, విరాళాలతో మన దగ్గర ఉన్న రాముని గుళ్ళను బాగు చేసుకుందామని చేసిన వ్యాఖ్యలు దుమారాన్నే రేపాయి.
ఇప్పటి వరకు ఏ మతంపై వ్యాఖ్యలు చేసిన చరిత్ర కలిగి లేని టీఆర్ఎస్ కు ఇలా ఇప్పడు మతం వలలో చిక్కుకోవడంతో మరింత ఇరకాటంలో పడిందనీ చెప్పవచ్చు.