తమిళనాడులో ఘోరం జరిగింది.తంజాపూర్ జిల్లాలోని మేలవీధిలో, కోట్టై అగళి ప్రాంతానికి చెందిన భువనేశ్వరి తన ఇద్దరు కవల పిల్లలను నిన్న శనివారం ఇంట్లో చాప పై పడుకోబెట్టి స్నానానికి వెళ్లిందట.
అయితే ఎక్కడి నుండి వచ్చిందో ఓ కోతుల గుంపు వీరింట్లోకి చొరబడి ఆ శిశువులిద్దరిని ఎత్తుకెళ్లాయట.స్నానం చేసి వచ్చిన భువనేశ్వరి ఇంట్లోకి వెళ్లి చూడగా ఆ శిశువులు కనిపించక పోవడంతో భయపడి పోయి బయట వెతుకుతున్న క్రమంలో ఇంటి పైకప్పు నుంచి శిశువు ఏడుపు వినిపించిందట.
భయపడుతూనే ఇంటిపైకి చూడగా అక్కడ కూర్చున్న కోతి చేతిలో పాప ఉండటాన్ని గమనించి భువనేశ్వరి ఏడుస్తూ కేకలు వేసింది.
ఆ అరుపులు విని బయటకు వచ్చిన ఇరుగు పొరుగు వారు కోతిని తరమడంతో ఒక శిశువును వదిలి పారిపోయింది.
ఇక రెండో శిశువు కోసం వెతుకుతుండగా ఇంటి వెనుక ఉన్న కందకంలో కనిపించిందట.స్దానికులు వెంటనే ఆ శిశువును ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
దీంతో ఆ తల్లి హృదయ వేదన వర్ణనాతీతం.ఆ తల్లి ఏడుపును ఆపడం ఎవరి వల్ల కాలేదట.