ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ లో సోమవారం ఉదయం స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది.హాస్పిటల్ లోని ఆపరేషన్ థియేటర్ పక్కనే ఉన్న ఎమర్జెన్సీ వార్డులో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.
ఈ ప్రమాదంలో ఎవరు గాయపడలేదని అధికారులు వెల్లడించారు.విషయం తెలియగానే ఘటనా స్థలానికి ఏడు ఫైర్ ఇంజిన్లు వచ్చి మంటలను ఆర్పేశాయి.
తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో హాస్పిటల్ నుండి కాల్ వచ్చిందని వెంటనే ఫైరింజన్లు పంపించామని ఢిలీ ఫైర్ సర్వీస్ డైరక్టర్ అతుల్ గార్గ్ చెప్పారు.ఈ వార్డ్ లోని పేషెంట్స్ ను వెంటనే అక్కడ నుండి ఖాళీ చేయించినట్టు పోలీస్ అధికారులు తెలిపారు.
ఈ సంఘటనలో రోగులు, హాస్పిటల్ సిబ్బంది ఎవరు గాయపడలేదని వారు చెప్పారు.
అగ్నిప్రమాదానికి గల కారణాలు ఏంటన్నది తెలియలేదు.
షార్ట్ సర్క్యూట్ వల్లే ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చని చెబుతున్నారు.ఎయిమ్స్ హాస్పిటల్ లో ఫైర్ యాక్సిడెంట్ సిబ్బందిని, రోగులను షాక్ అయ్యేలా చేసింది.
గతంలో కూడా ఈ హాస్పిటల్ లో ఫైర్ యాక్సిడెంట్ లు జరిగాయి.జూన్ 21న జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో కొవిడ్ ల్యాబ్ పూర్తిగా దగ్ధమైంది.స్టోర్ రూం లోని కొన్ని రికార్డులు కూడా కాలిపోయాయని చెప్పారు.2019 ఆగష్టులో జరిగిన ప్రమాదంలో 34 ఫైరింజన్లు వినియోగించారని తెలుస్తుంది.మంటలను పూర్తిగా అందుపులో రావడానికి ఆరుగురు గంటల పాటు సమయం పట్టిందని తెలుస్తుంది.