టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటన గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి తెలియని వారెవ్వరూ లేరు.ఎన్నో సినిమాలలో నటించి మంచి సక్సెస్ లు అందుకొని మెగాస్టార్ గా నిలిచాడు.
ఇప్పటికీ వరుస సినిమాలతో యంగ్ హీరోలకు పోటీగా దూసుకెళ్తున్నాడు.పైగా కొత్త కొత్త దర్శకులకు కూడా అవకాశం ఇస్తున్నాడు మెగాస్టార్.
కానీ పూరి జగన్నాథ్ ను మాత్రం అసలు పట్టించుకోవడం లేదు.
ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ప్రతి ఒక్క సినిమాకు మంచి సక్సెస్ అందుకొని స్టార్ డైరెక్టర్ గా నిలిచాడు.ఇక ఈయన రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ తో కూడా సినిమాలు చేశాడు.
కానీ ఇప్పటివరకు చిరంజీవితో ఒక్క సినిమా కూడా చేయలేకపోయాడు.పైగా చిరంజీవికి చాలాసార్లు ఎన్నో కథలు వినిపించిన కూడా.
ఆయన నచ్చలేదని చెప్పాడట.
అయినా కూడా చిరంజీవితో సినిమా చేయాలనే ప్రయత్నాన్ని ఆపకుండా.
మరో సినిమాను ఆయన ముందుకు తీసుకెళ్లాడట.
ఆటో జానీ అనే కథను చిరంజీవి దగ్గరికి తీసుకెళ్లి వినిపించాడట.చిరంజీవికి ఫస్టాఫ్ నచ్చిందట.కానీ సెకండాఫ్ మాత్రం చెప్పినప్పుడు ఏమి స్పందించలేదని.
కేవలం తర్వాత మాట్లాడదామని అన్నారట.అప్పటి నుంచి ఈ సినిమా గురించి ఎటువంటి పిలుపు కూడా తననుండి రాలేదని తెలిపి బాధపడ్డాడు పూరి జగన్నాథ్.
అప్పుడే ఆ సినిమా సెకండాఫ్ కథలో కరెక్షన్ చేద్దామని చిరంజీవి అంటే ఇంకో వెర్షన్ కూడా రాసే వాడిని అని పూరి జగన్నాథ్ తెలిపాడు.దీంతో పూరీ ఈ విధంగా ఓపెన్ అయినందుకు చిరంజీవికి నచ్చలేదని.అందుకు చిరంజీవి ఆయనను పిలవలేదని పూర్తిగా ఆయనను పక్కకు పెట్టేసాడని టాక్ వినిపించింది.దీంతో ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా రాకపోగా అభిమానులు కూడా నిరుత్సాహ పడ్డారు.
కానీ ఏనాటికైనా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావాలని కోరుకుంటున్నారు.
ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఈ సినిమా తర్వాత మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ లూసిఫర్ రీమేక్ లో నటించనున్నాడు.అంతేకాకుండా వేదాళం రీమేక్ లో కూడా సిద్ధంగా ఉన్నాడు చిరంజీవి.
మరోవైపు బాబీ దర్శకత్వంలో కూడా ఓ సినిమాకు సైన్ చేశాడు.ఇక ఈ డైరెక్టర్ లు ఇదివరకు తమ దర్శకత్వంలో కొంతవరకు సక్సెస్ను అందుకున్న కూడా వారికి అవకాశాలు ఇచ్చాడు చిరంజీవి.