అతడు అందరిలాగానే పాన్ అమ్ముతాడు.అయితే అతడి ఆలోచనలు మాత్రం విభిన్నంగా ఉన్నాయి.
ఇతరులలా కాకుండా వైవిధ్యంగా ఆలోచించాడు.కొన్నేళ్ల తన కలలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకున్నాడు.
తన తాతల కాలం నాటి వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాడు.ఈ క్రమంలో తన ఒంటి నిండి బంగారం ధరిస్తూ, ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నాడు.
తమ వద్ద పాన్ను మాజీ ఉపరాష్ట్రపతులు సైతం రుచి చూశారని గర్వంగా చెబుతున్నాడు.అతడిని చూడాలని కూడా చాలా మంది అక్కడికి వస్తుంటారు.
అంతలా అతడు ప్రాచుర్యం పొందాడు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
రాజస్థాన్ రాష్ట్రం భికనీర్కు చెందిన ఫూల్చంద్ సేవగ్ (62)ది పేద కుటుంబం.అయినప్పటికీ తన నేపథ్యం వల్ల అతడు ఎప్పుడూ బాధ పడలేదు.అతడు తన తాతల కాలం నుంచి, అంటే 72 ఏళ్ల క్రితం ప్రారంభించిన పాన్ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు.తాను వ్యాపారం మొదలు పెట్టినప్పటి నుంచి అతడికి ఓ కోరిక ఉండేది.
బంగారం కొనుక్కోవాలని అనుకున్నాడు.తన వ్యాపారం అంతంత మాత్రమే.
చివరికి ఏడాది పొడవునా తాను దాచుకున్న డబ్బులతో ఒక్కో బంగారు ఆభరణాన్ని కొంటూ వచ్చాడు.అందరిలా వాటిని ఇంట్లో దాచుకోకుండా ఒంటిపై ధరించేవాడు.చేతికి కంకణం, మెడలో గొలుసు, చెవులకు జుంకాలు ఇలా తన ఒంటిపై రూ.20 లక్షల విలువైన బంగారం సమకూర్చుకున్నాడు.
అవి ధరించే తన వ్యాపారం కొనసాగిస్తున్నాడు.తన తాతల కాలం నాటి ఈ వ్యాపారాన్ని అంచెలంచెలుగా పెంచేశాడు.ఎంతలా అంటే అతడిని చూసేందుకే చాలా మంది వస్తుంటారు.ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన వారు అతడి వద్ద పాన్ కొనుక్కుని తీసుకెళ్తుంటారు.ఇక్కడి నుంచి బంధువుల ఇంటికి వెళ్లే వారు కూడా పాన్ ప్యాక్ చేయించుకుంటారు.మాజీ ఉపరాష్ట్రపతి మాజీ ఉపరాష్ట్రపతి భైరాన్ సింగ్ షెకావత్ తన పాన్ను తిన్నారని ఆయన గర్వంగా చెబుతున్నాడు.
ఇక స్థానికంగా ఎంతో పేరొందిన ఇతడితో చాలా మంది ఉత్సాహంగా సెల్ఫీలు దిగుతున్నారు.