స్వేచ్చ అనేది చిన్న పదమే కానీ నేడు సమాజంలో ఈ స్వేచ్చ ఎక్కువైందో, లేక తక్కువైందో అర్ధం కాని పరిస్దితి ఉంది.మితిమీరిన స్వేచ్చ ఎన్నో అనర్ధాలకు మూలం అవుతుందనిపిస్తుంది.
నేడు లోకంలో జరుగుతున్న దారుణాలను చూస్తుంటే.
ఇకపోతే చెడపకురా చెడేవు అనే సామేత వినే ఉంటారు.
ఈ విషయం తెలుసుకుంటే నిజమే అనిపిస్తుంది.ఎందుకంటే పెళ్లి చేసుకోవడం లేదని ఓ యువతి మీద పెట్రోల్ పోసి చంపాలని చూసిన వాడే చివరికి చావడం ఆశ్చర్యం.
ముంబయిలోని మేఘ్ వాడీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన గురించి తెలుసుకుంటే.
విజయ్ కాంబే అనే వ్యక్తి, ఓ యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
కానీ ఆ యువతి అంత బాధలో కూడా తనను చంపాలనుకున్న వాడిని తనతో తీసుకెళ్లలని భావించి, అగ్నికీలల్లో చిక్కుకున్నప్పటికీ విజయ్ కాంబేని గట్టిగా పట్టుకుంది.అంతే ఆ మంటలు కూడా అతనికి అంటుకోగా తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి మరణించాడు.
ఆ యువతి మాత్రం ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.ఆమె పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
చూశారా విధి రాత అంటే ఇదే కావచ్చూ.చెడు చేసే వాడే ముందు మరణించాడు.
అయినా ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్న మనుషుల్లో మాత్రం మానవత్వం అనేది మచ్చుకైనా కనబడటం లేదు.