పుట్టిన పిల్లలను కొందరు వ్యక్తులు చెత్త కుప్పల్లో పడేస్తున్న ఘటనలో రాష్ట్రంలో ఎక్కువగా నమోదవుతున్నాయి.ఆస్పత్రి ఆవరణలోనే పడేసి వెళ్తున్న ఘటనలు చాలా చూస్తున్నాం.
పెళ్లి కాకుండా అక్రమ సంబంధంతో కడుపు తెచ్చుకుని పుట్టిన పిల్లలను చెత్తకుప్పల్లో పడేస్తున్నారు.అమ్మ ప్రేమ ఎంతో గొప్పది అని కొందరూ భావిస్తారు.
కొడుకు పుట్టినప్పటి నుంచి ముసలివాడైనా అమ్మ ప్రేమలో మార్పు ఉండదని అంటుంటారు.కానీ కొందరు మహిళలు చేసే పని వల్ల ఆ అమ్మ ప్రేమకు విలువ లేకుండా పోతోంది.
తాజాగా ఖమ్మం జిల్లాలోని నెలకొండపల్లి మండలంలో ఓ ఘటన చోటు చేసుకుంది.ఇంకా కళ్లు కూడా తెరవని పసి ప్రాణాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకుప్పలో పడేసి వెళ్లిపోయారు.
మండలంలోని రాయగూడెంలోని ముత్యాలమ్మ గుడి సమీపంలో ఉన్న చెత్తకుప్పలో అప్పుడే పుట్టిన పిల్లాడిని కొందరు వ్యక్తులు పడేసి వెళ్లిపోయారు.ఆ వైపుగా వెళ్తున్న కొందరు గ్రామస్థులు పిల్లాడిని గుర్తించి ఒక చోట పెట్టి ఈ విషయాన్ని వైద్య సిబ్బందికి, గ్రామ సర్పంచ్, పోలీసులకు తెలియజేశారు.
ఈ మేరకు అందరూ ఘటనా స్థలానికి చేరుకున్నారు.పిల్లాడికి పరీక్షలు నిర్వహించడానికి వైద్యులు స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.గ్రామస్థుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.