టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికైన దగ్గర నుండి కాంగ్రెస్ వర్సెస్ టీ.ఆర్.
ఎస్ మాటల యుద్ధం కొనసాగుతుంది.పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకానికి 25 కోట్లు వసూలు చేశారని సుధీర్ రెడ్డి ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో సుధీర్ రెడ్డికి తెలంగాణా కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ఠాగూర్ లీగల్ నోటీస్ పంపించారు.ఏం ఆధారాలు ఉన్నాయని సుధీర్ రెడ్డి అలా మాట్లాడరని నోటీసులో ప్రస్థావించారు.
సుధీర్ రెడ్డి ఆరోపణలతో ఠాగూర్ పరువు, ప్రతిష్టలకు భంగం కలిగిందని లీగల్ నోటీసులో పేర్కొన్నారని న్యాయవాది రవీంద్రన్ చెప్పారు.
దీనికి వివరణగా సుధీర్ రెడ్డి వారం రోజుల్లో క్షమాపణ చెప్పాలని.
రాత పూర్వకంగా వివరణ ఇచ్చి క్షమాపణ చెప్పాలని లేకపోతే కోటి రూపాయల పరువు నష్టం దావా వేస్తామని ఠాగూర్ తరపున లాయర్ చెప్పారు.కాంగ్రెస్ నుండి గెలిచి అధికార పార్టీలోకి వెళ్లిన వారి మీద రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.
దానికి స్పందగా సుధీర్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఠాగూర్ పంపించిన లీగల్ నోటీసులపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఏవిధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.