దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది.రోజురోజుకు ఈ మహమ్మారి బారినపడే వారి సంఖ్య విపరీతంగా పెరిగుతూనే ఉన్నాయి.
ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలు కోల్పోయారు.మరికొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇప్పటికే దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.తాజాగా ఆరోగ్య శాఖ హెల్త్ బులిటైన్ ని విడుదల చేసింది.
గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా మరో 97,570 కరోనా పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి.అంతేకాకుండా ఈ మహమ్మారి కారణంగా మరో 1201 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.అయితే ఇప్పటివరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 46,59,985కు చేరుకుంది.దేశంలో ప్రస్తుతం 9,58,316 కరోనా కేసులు యాక్టివ్ లో ఉన్నట్లు వెల్లడించారు.
ఇక 36,24,197 మంది ఈ మహమ్మారి నుండి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారని వెల్లడించారు.ఇక ఈ వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 77,472 మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోగ్యశాఖ వెల్లడించింది.
అంతేకాక ఒక్క శుక్రవారం రోజే 10,91,251 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలియజేశారు.అయితే ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,51,89,226 శాంపిల్స్ పరీక్షించినట్లు తెలిపారు.
ఇక దేశవ్యాప్తంగా మిలియన్ జనాభాకు 39,915 కరోనా టెస్టులు చేసినట్లు వెల్లడించారు.