భారత్, దక్షిణాఫ్రికా మధ్య టీ20 చివరి మ్యాచ్ జరగనుంది.ఇండోర్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.మూడు మ్యాచ్ ల సిరీస్ ఇప్పటికే 2-0 ఖాతాతో భారత్ కైవసం చేసుకుంది.
అయితే, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు భారత జట్టు ఆడబోయే ఆఖరి టీ20 మ్యాచ్ ఇదే కానుంది.ఈమ్యాచ్లో ఎట్టకేలకు గెలిచి పరువు నిలబెట్టుకోవాలని సౌతాఫ్రికా ఆటగాళ్లు చూస్తుండగా.
ఈ మ్యాచ్ను కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తోంది.మరోవైపు ఈరోజు టీ20 మ్యాచ్ కోసం సిద్ధమవుతున్న తరుణంలో బీసీసీఐ స్వల్ప మార్పులు చేసింది.
దక్షిణాఫ్రికాతో జరగనున్న చివరి టీ20 మ్యాచ్ నుంచి విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్లకు విశ్రాంతి లభించింది.