తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభపై క్లారిటీ మిస్సైంది.బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర ముగింపు సభపై పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొన్నట్లు తెలుస్తోంది.
షెడ్యూల్ ప్రకారం ఈనెల 17న కరీంనగర్ లో పాదయాత్ర ముగింపు సభను ఏర్పాటు చేయాలి.అయితే షెడ్యూల్ లో మార్పులు చేస్తూ 16న సభను పెట్టాలని పార్టీ నేతలు భావించారు.తాజాగా ఈనెల 15వ తేదీన పాదయాత్ర ముగింపు సభ ఉంటుందని చెబుతున్నారు.16న జేపీ నడ్డా హిమాచల్ ప్రదేశ్ పర్యటనతో 15న పాదయాత్ర ముగింపు సభ ఉంటుందని బీజేపీలో టాక్ వినిపిస్తోంది.అయితే సభను ఏ తేదీన నిర్వహిస్తారనే విషయాన్ని పార్టీ వర్గాలు వెల్లడించేంత వరకు వేచి చూడాల్సిందే.