రెండో సారి కూడా ఆడపిల్ల పుట్టింది అని దారుణానికి పాల్పడ్డ కసాయి తండ్రి

రేగుంట లో దారుణ ఘటన వెలుగు చూసింది.ఆడపిల్ల అయిన పాపానికి నెల రోజుల పసికందు ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

 The Kotha Gudem Man Puts Doughter In The-TeluguStop.com

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం రేగుంట లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే….

కత్తిగూడెం గ్రామానికి చెందిన అడబాల సూర్య తేజ, రేగుంట గ్రామానికి చెందిన అఖిల రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు.అయితే వీరికి తోలి సంతానం గా ఏడాది కుమార్తె లక్ష్మి ఉంది.

అయితే ఇటీవల అఖిల రెండో బిడ్డకు జన్మనివ్వగా రెండోసారి కూడా అమ్మాయే పుట్టింది.అయితే పుట్టిన నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఇంటికి రాని సూర్య తేజ సోమవారం మాత్రం ఇంటికి వచ్చాడు.

అయితే మగ బిడ్డ కాకుండా ఆడ బిడ్డ పుట్టింది అన్న కోపం తో అతడు ఆ నెల రోజుల పసికందు ను అత్యంత కర్కశంగా నీటి తొట్టిలో పడేసి దారుణంగా హతమార్చాడు.మంగళవారం ఉదయం నిద్రలేచిన అఖిల మంచం పై పసిపాప కనిపించకపోవడం తో తన తల్లికి విషయం తెలిపింది.

దీంతో ఇద్దరూ కలిసి పాప కోసం వెతకగా ఇంటి ఆవరణలో ఉన్న నీటి తొట్టెలో పాప తేలి ఉండడం గమనించారు.దీనితో పాప ని ఆ స్థితిలో చూసిన అఖిల గుండెలవిసేలా రోదించింది.

Telugu Akhila, Bad, Baby, Surya Teja, Telugu Ups-

కానీ ఆ చిన్నారి అప్పటికే ప్రాణాలు కోల్పోవడం తో స్థానికులు సైతం బాధపడ్డారు.కేవలం రెండో సారి కూడా అమ్మాయే పుట్టింది అన్న ఉద్దేశ్యం తో నీటి తొట్టిలో పడేసి పాప ప్రాణాలను హరించిన కన్న తండ్రి సూర్య తేజ ను గ్రామస్థులు చితకబాది పోలీసులకు అప్పగించారు.ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube