సాయిధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేష్ జంటగా దేవ కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన రిపబ్లిక్ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చిందనే సంగతి తెలిసిందే.ఈ సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లు రావడం లేదని తెలుస్తోంది.
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో నటించారు.అయితే ఈ సినిమా విషయంలో వివాదం చెలరేగింది.
మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొల్లేరు వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ గ్రామాలలో చెరువులు, చేపలను విషతుల్యం చేస్తున్నామంటూ తప్పుగా ప్రచారం చేస్తున్నారని కొల్లేరు వాసులు చెప్పుకొచ్చారు.
ఈ సినిమాల వల్ల తమ మనోభావాలు దెబ్బ తిన్నాయని కొల్లేరు వాసులు పేర్కొన్నారు.ఈ సినిమాను నిలిపివేయాలని కొల్లేరు వాసులు అన్నారు.కొల్లేరు గ్రామ వాసులు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీకి ఫిర్యాదు చేసి సమస్యలను వెల్లడించారు.
కొల్లేరు వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రిపబ్లిక్ మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
ఈ సినిమాలో రమ్యకృష్ణ, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించారు.ఈ సినిమాకు 13.60 కోట్ల రూపాయల బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది.ఈ సినిమాకు నాలుగు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని సమాచారం.
వీకెండ్ లో ఈ సినిమాకు బాగానే కలెక్షన్లు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ పర్ఫామెన్స్ కు మంచి మార్కులు పడ్డాయి.రిపబ్లిక్ సినిమా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.ప్రతిరోజూ పండగే సినిమాతో సక్సెస్ సాధించిన సాయిధరమ్ తేజ్ కు రిపబ్లిక్ సినిమాతో షాక్ తగిలినట్టేనని చెప్పవచ్చు.
మరోవైపు సాయిధరమ్ తేజ్ కోలుకుంటున్నాడని అతి త్వరలో డిశ్చార్జ్ కానున్నాడని తెలుస్తోంది.