మరికొద్ది రోజుల్లో ప్రపంచ టెస్ట్ క్రికెట్ చాంపియన్షిప్ కోసం న్యూజిలాండ్ – టీమిండియా జట్లు టెస్ట్ కోసం సన్నద్ధం అవుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే.అయితే తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా జట్టు ను అధిగమించి న్యూజిలాండ్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.
ప్రస్తుతం ఇంగ్లాండ్ లో జరుగుతున్న ఇంగ్లాండ్ – న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ లో భాగంగా తాజా టెస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్ జట్టు ఇంగ్లాండ్ పై భారీ విజయాన్ని నమోదు చేసింది.
ఈ మ్యాచ్ కు మందు దశాంశ స్థానాలలో టీమిండియా కాస్త ముందు ఉండడంతో మొదటి స్థానంలో ఉండగా తాజాగా చేరిన విజయంతో న్యూజిలాండ్ 2 పాయింట్లు జత చేసుకొని మొదటి స్థానానికి చేరుకుంది.
దీంతో న్యూజిలాండ్ 123 స్థానంలో ఉండగా విరాట్ కోహ్లీ టీమిండియా 121 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకుంది.టీమిండియా తర్వాత 108 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్థానంలో కొనసాగుతోంది.
గత సంవత్సరం మూడో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ జట్టు తాజాగా జరిగిన టెస్ట్ ఓడిపోవడంతో నాలుగో స్థానాన్ని చేరుకుంది.ఇంగ్లాండ్ తర్వాత పాకిస్థాన్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ జట్లు ఉన్నాయి.ఇకపోతే తాజాగా కివీస్ ఇంగ్లాండ్ జట్టు 22 ఏళ్ల తర్వాత ఆదిత్య ఇంగ్లాండు పై ఇన్నింగ్స్ విజయం సాధించడంతో న్యూజిలాండ్ జట్టు ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది.ఈ విజయంతో న్యూజిలాండ్ ప్రపంచ చాంపియన్షిప్ ఫైనల్ కు ముందు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుందని చెప్పవచ్చు.