భారత్ లో సుదీర్ఘంగా జరుగుతున్న రైతు ఉద్యమం ఎంతో మందిని కదిలిస్తోంది.నిన్న మొన్నటి వరకూ భారత్ కు మాత్రమే పరిమితం అయిన ఈ ఉద్యమం నేడు అంతర్జాతీయ స్థాయిలో పీక్ స్టేజ్ కి చేరుకుంది.
కొన్ని రోజుల క్రితం వరకూ ఈ ఉద్యమానికి బాలివుడ్, హాలీవుడ్ నటీ నటులు మద్దతు ఇవ్వడంతో ఒక్కసారిగా ఈ ఉద్యమం పీక్ స్టేజ్ కి వెళ్ళిపోయింది.ప్రపంచ వ్యాప్తంగా ఈ ఉద్యమానికి మద్దతు దొరుకుతూ వచ్చింది.
అమెరికాలో ఉండే భారతీయ ఎన్నారై సంఘాలు ఈ ఉద్యమానికి మద్దతు తెలిపాయి, స్థానికంగా ర్యాలీలు కూడా చేపట్టాయి.
అయితే అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ బహిరంగంగా ప్రకటించడంతో భారత ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది.
ఇది మా అంతర్గత వ్యవహారమని ఇందులో ఏ దేశం కూడా జోక్యం చేసుకోవడానికి వీలులేదని తేల్చి చెప్పేసింది.కానీ ఇది భారత్ యొక్క వ్యక్తిగత వ్యవహారం కాదని భావిస్తున్న పలు దేశాలు రైతుల ఆందోళనకు మద్దతు ఇస్తూనే ఉన్నాయి.
తాజాగా అమెరికాలోని కాలిఫోర్నియా లో అతిపెద్ద ఫుడ్ బాల్ సూపర్ బాల్ -2021 కార్యక్రమం నిర్వహించారు.ఈ ఈవెంట్ ను దాదాపు 10 కోట్ల మంది చూస్తారట.ఈ ఈవెంట్ జరుగుతున్న సమయంలో కోట్లాది మంది చూస్తుండగానే భారత్ లోని రైతుల ఉద్యమానికి సంభందించిన.
30 సెకన్ల నిడివిగల ఓ వీడియో ప్రసారం అయ్యింది.అందరిని కదిలించేలా సాగిన ఈ వీడియో లో రైతులకు మనం మద్దతు తెలుపుదాం అని ఉంది.సరైన తిండి లేకపోయినా, భవిష్యత్తు అంధకారంలో ఉన్నా ఆ రైతులు చేస్తున్న పోరాటానికి మనవంతు మద్దతు ఇవ్వకపోతే ఎలా అంటూ ఈ వీడియో సాగింది.
ఎంత మంది ఈ ఉద్యమంలో చనిపోయారు, రైతులు ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారు అనే పుటేజ్ లో ప్రదర్శిస్తూ అందరిని కట్టిపడేశారు.ఇదిలాఉంటే ఇంత పెద్ద ఈవెంట్ లో ఈ వీడియో ప్రదర్సన చేయాలంటే ఎంత హీనంగా చూసుకున్నా రూ.40 కోట్లు పైనే ఖర్చు అవుతుందట, మరో ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎవరు ఖర్చు పెట్టారు అంటే వాల్ సీక్ అనే కమ్యూనిటీ నిధులను ఈ యాడ్ కోసం వెచ్చించారని తెలుస్తోంది.మరి సదరు వీడియోపై భారత ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి మరి.