కూకట్‌పల్లిలో కలకలం.. కుక్కను చంపి దారుణంగా.. ??

కొందరు పని లేని సన్నాసులు చేసే పనుల వల్ల ఎన్ని గొడవలు జరుగుతాయో ఈ మధ్య కాలంలో ప్రత్యక్షంగా కళ్లకు కనబడుతుంది.ఇప్పటికే ఏపీ ఆలయాల్లో విగ్రహల ధ్వంసం, గత కొంత కాలంగా తీవ్ర కలకలం రేపుతుంది.

 The Idols Were Destroyed At The Durga Mata Temple In Kukatpally, Hyderabad, Kuka-TeluguStop.com

చివరికి రాజకీయ పార్టీల మధ్య విమర్శలకు కూడా దారి తీసింది.కాగా తాజాగా ఇలాంటి పనే హైదరాబాద్‌లో జరగడం చర్చకు దారితీస్తుంది.

ఇకపోతే కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కూకట్‌పల్లి మూసాపేట్ సర్దార్‌ నగర్‌లోని దుర్గామాత ఆలయంలో విగ్రహాలతో పాటుగా, జంట నాగుల విగ్రహాన్ని సైతం ధ్వంసం చేశారట.అంతే కాకుండా ఆలయ ఆవరణలో ఓ కుక్కను కూడా వేలాడదీసి హత్య చేసారట.

మానవత్వం విలువ తెలియని ఆ కౄరులు ఓ మూగజీవి ప్రాణం తీయడం వారి నేరపూరితమైన మనస్సుకు అద్దం పడుతుంది.ఇక ఇంతటి నీచానికి దిగజారిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు ఆలయం ముందు ఆందోళనకు దిగారు.

కాగా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి,కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఇక మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్న ఇలాంటి అగంతకులను పట్టుకుని శిక్షించాలని ఈ విషయం తెలిసిన నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube