కొందరు పని లేని సన్నాసులు చేసే పనుల వల్ల ఎన్ని గొడవలు జరుగుతాయో ఈ మధ్య కాలంలో ప్రత్యక్షంగా కళ్లకు కనబడుతుంది.ఇప్పటికే ఏపీ ఆలయాల్లో విగ్రహల ధ్వంసం, గత కొంత కాలంగా తీవ్ర కలకలం రేపుతుంది.
చివరికి రాజకీయ పార్టీల మధ్య విమర్శలకు కూడా దారి తీసింది.కాగా తాజాగా ఇలాంటి పనే హైదరాబాద్లో జరగడం చర్చకు దారితీస్తుంది.
ఇకపోతే కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కూకట్పల్లి మూసాపేట్ సర్దార్ నగర్లోని దుర్గామాత ఆలయంలో విగ్రహాలతో పాటుగా, జంట నాగుల విగ్రహాన్ని సైతం ధ్వంసం చేశారట.అంతే కాకుండా ఆలయ ఆవరణలో ఓ కుక్కను కూడా వేలాడదీసి హత్య చేసారట.
మానవత్వం విలువ తెలియని ఆ కౄరులు ఓ మూగజీవి ప్రాణం తీయడం వారి నేరపూరితమైన మనస్సుకు అద్దం పడుతుంది.ఇక ఇంతటి నీచానికి దిగజారిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు ఆలయం ముందు ఆందోళనకు దిగారు.
కాగా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి,కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఇక మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్న ఇలాంటి అగంతకులను పట్టుకుని శిక్షించాలని ఈ విషయం తెలిసిన నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారట.