హుజురాబాద్ ఏసీపీ కార్యాలయంలో టీఆర్ఎస్ నాయకులు హల్ చల్ చేసినట్టు తెలుస్తోంది.డబ్బుల విషయంలో అన్నదాత సీడ్ కంపెనీ ఓనర్ ను బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అంతేకాకుండా సీడ్ కంపెనీకి తాళం వేయడంపై ఓనర్ పోలీసులను ఆశ్రయించారు.బాధితుని ఫిర్యాదు మేరకు హుజూరాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.
అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఏసీపీ కార్యాలయంలో సీడ్ కంపెనీ ఓనర్, టీఆర్ఎస్ నాయకులతో రాజీ కుదిర్చే ప్రయత్నం జరిగింది.
ఏసీపీ వెంకట్ రెడ్డి ఎదుటే సీఐ, సీడ్ కంపెనీ ఓనర్ ను నేతలు దుర్భాషిలాడినట్టు తెలుస్తోంది.