భార్య భర్తలు అన్నాక చిన్నచిన్న గొడవలు సహజం.అయితే, ఓ వ్యక్తి భార్యతో కొన్ని కారణాల ద్వారా విడిపోయిన అనంతరం, ఆమెకు గుణపాఠం చెప్పాలని ఆమె ఫోన్ ను దొంగలించాడు.
ఇక ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే… నైరుతి ఢిల్లీలోని బదర్ పూర్ లో జీవనం కొనసాగించే వినోద్ అనే యువకుడు దోపిడిలు, స్నాచింగ్ కు సంబంధించి 51 కేసులో నిందితుడిగా ఉన్నాడు.ఇలా వినోద్ దొంగతనాలకు పాలపడుతూ ఉండడంతో అతని భార్య అతని వదిలేసింది.
గడిచిన ఆరు నెలలుగా వారు ఇద్దరూ విడివిడిగా జీవనం కొనసాగిస్తున్నారు.ఇక వినోద్ హర్యానాలోని ఫరీదాబాద్ కి వెళ్లి అక్కడ జీవనం కొనసాగిస్తున్నాడు.
ఇక తాజాగా బదర్ పూర్ లో జీవనం కొనసాగిస్తున్న అతని భార్య నిషా ఇంటి వద్దకు వెళ్లి… కత్తితో బెదిరించి ఆమె ఫోన్ ను దొంగలించాడు.దీనితో ఆమె వెంటనే పోలీసులకు ఆశ్రయించి అతనిపై ఫిర్యాదు చేసింది.
అనంతరం బసంత్ పూర్ లో వినోద్ ను గుర్తించిన పోలీస్ అధికారులు, సమాచారం అందడంతో అతనిని అరెస్ట్ చేసి డిప్యూటీ పోలీస్ కమిషనర్ కు అప్పగించారు.
ఇక నిందితుడు వినోద్ తన స్నేహితులు రాకేష్, రవి, చందన్ లతో కలిసి సెల్ ఫోన్ ను దొంగతనాలు చేసేవారని పోలీసు అధికారులు తెలియజేశారు.
ఆ మొబైల్స్ ను పంజాబ్, ఉత్తరప్రదేశ్ లలో అమ్మి సొమ్ము చేసుకొనే వారని పోలీస్ అధికారులు తెలియజేశారు.దింతో పోలీసు అధికారుల విచారణలో తన భార్య తనని వదిలి ఆమెకు గుణపాఠం చెప్పాలని ఆమె ఫోన్ లో దొంగలించినట్లు నిందితుడు వినోద్ తెలియజేశాడు.
నిందితుడు దగ్గరనుంచి ఒక కత్తి, 12 మొబైల్ ఫోన్లను పోలీస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.