మృతి చెందిన ఇద్దరు అభ్యర్థుల భారీ విజయం.. ఆ అభ్యర్థులు వీరే..

గెలుస్తామని ధీమాతో ఎన్నికల్లో బరిలో నిలిచారు.గడప గడపకి తిరిగి వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు వివరించి తమకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

 The Huge Victory Of The Two Candidates Who Died .. Who Are Those Candidates, And-TeluguStop.com

సీఎం జగన్ మీద నమ్మకంతో జనాలు వారికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించారు.కానీ దురదృష్టం వారిని వెంటాడింది కోవిడ్ రూపంలో వారిని కాటేసింది.

ఫలితాలు వెలువడడానికి ముందే వారు మృత్యువాత పడ్డారు.పచ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగర పాలక సంస్థ ఎన్నికల్లో ఫలితాల్లో భారీ మెజార్టీతో గెలిపించి ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రెండు నెలల క్రితం కరోనా బారిన పడి మృతి చెందారు.45వ డివిజన్ నుంచి పోటీచేసినా బేతపూడి ప్రతాప్ చంద్ర ముఖర్జీ 1058 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.46వ డివిజన్ నుంచి పోటీ చేసిన ప్యారీ బేగం 1232 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రికార్డు స్థాయిలో విజయం పొంది నగర పీఠాన్ని దక్కించుకుంది.57 డివిజన్లో గాను 40 డివిజన్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు గెలిపొందగా తెలుగుదేశం పార్టీ  కేవలం మూడు స్థానాలకే పరిమితమైయింది.జనసేన వామపక్షాలు కాంగ్రెస్ ఉనికి కోల్పోయాయి.ఈ నెల 30న మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube