గెలుస్తామని ధీమాతో ఎన్నికల్లో బరిలో నిలిచారు.గడప గడపకి తిరిగి వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు వివరించి తమకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
సీఎం జగన్ మీద నమ్మకంతో జనాలు వారికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించారు.కానీ దురదృష్టం వారిని వెంటాడింది కోవిడ్ రూపంలో వారిని కాటేసింది.
ఫలితాలు వెలువడడానికి ముందే వారు మృత్యువాత పడ్డారు.పచ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగర పాలక సంస్థ ఎన్నికల్లో ఫలితాల్లో భారీ మెజార్టీతో గెలిపించి ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రెండు నెలల క్రితం కరోనా బారిన పడి మృతి చెందారు.45వ డివిజన్ నుంచి పోటీచేసినా బేతపూడి ప్రతాప్ చంద్ర ముఖర్జీ 1058 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.46వ డివిజన్ నుంచి పోటీ చేసిన ప్యారీ బేగం 1232 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రికార్డు స్థాయిలో విజయం పొంది నగర పీఠాన్ని దక్కించుకుంది.57 డివిజన్లో గాను 40 డివిజన్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు గెలిపొందగా తెలుగుదేశం పార్టీ కేవలం మూడు స్థానాలకే పరిమితమైయింది.జనసేన వామపక్షాలు కాంగ్రెస్ ఉనికి కోల్పోయాయి.ఈ నెల 30న మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగనుంది.