20 ఏళ్ల క్రితం డైరెక్టర్ మణిరత్నం మార్కు వేసిన రొమాంటిక్ డ్రామా చిత్రం సఖి అందులో హీరో మాధవన్ హీరోయిన్ శాలిని ప్రేమ, పాటలు, సంగీతం ఇలా ఏదైనా సినిమా ప్రేక్షకులు మర్చిపోగలరా.? అప్పట్లో ఈ చిత్రం ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది.ఆ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న శాలిని అంతకుముందు తెలుగులో కొన్ని సినిమాల్లో నటించింది.బ్రహ్మపుత్రుడుజగదేకవీరుడు అతిలోకసుందరి వంటి చిత్రాల్లో ఆమె నటించింది.
ఆమె హీరో అజిత్ ను పెళ్లాడిన తర్వాత నెమ్మదిగా సినిమాలు తగ్గించింది.అయితే ఆమె మళ్ళీ తెరపై సందడి చేసేందుకు సిద్ధం అవుతుదట.
ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో ఇది హాట్ టాపిక్.అయితే శాలిని గాని, అజిత్ గాని తన పునరాగమనం పై ఎలాంటి ప్రకటన చేయలేదు.
మణిరత్నం తెరకెక్కిస్తున్నపొన్నియన్ సెల్వన్ చిత్రం తో శాలిని మళ్లీ సినిమాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.ప్రత్యేక పాత్రలో ఆమె కనిపించనున్నట్లు సమాచారం.
మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది.మొదటి భాగం 2022 వేసవిలో విడుదల చేయనున్నట్లు ఇటీవల ఈ చిత్రబృందం ప్రకటించింది.
ఈ సినిమాను ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.