ఆ ప్రముఖ హీరోయిన్ ని చూసి ఈ అమ్మాయి ఏంటి అచ్చం పని పిల్లల ఉంది అని అన్నాడు ఒక అగ్రహీరో.ఇంతకు ఆ అగ్ర హీరో ఎవరు అని అనుకుంటున్నారా.? అదేనండి హీరో రాంకీ.ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరా అని అనుకుంటున్నారా.? ఆమె ఎవరో కాదండి.స్వయానా రాధిక చెల్లెలు నిరోషా.
నిరోషా మన తెలుగు సినిమా ప్రపంచానికి “న్యాయం కావాలి ” అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
హీరోయిన్ నిరోషా చిరంజీవి సరసన స్టువర్టుపురం పోలీస్ స్టేషన్, బాలయ్య సరసన నారి నారి నడుమ మురారి సినిమాలలో నటించి తనకంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది.1980 సంవత్సరంలో దూరదర్శన్ ఛానల్ లో చిత్రలహరిలో ప్రసారమయ్యే “బృందావనం సోయగం ” అనే సిమ్మింగ్ ఫుల్ పాటను అందరూ ఇట్టే గుర్తుపట్టేస్తారు నిరోషా ఎవరో అని.అలాగే ప్రముఖ దర్శకుడు దేవరాజన్ తెలుగులో సింధురపువ్వ గా తెరకెక్కించిన సినిమాతో తెలుగు ప్రజల మన్ననలను పొందింది.ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్ ను ఎంపిక చేసుకునే సమయంలో దర్శకుడు దేవరాజ్ నిరోషా ను సెలెక్ట్ చేశారు.
ఆ సమయంలో నిరోషా ఫోటోలు చూసి ఎవరు ఈ అమ్మాయి పని పిల్లలా ఉందని అన్నాడు ఆ సినిమా హీరో రాంకీ.కానీ, చివరకు తమిళ ఇండస్ట్రీలో సింధూరపూవే అనే సినిమాలో హీరో రాంకీ నే నిరోషా ను ఎంపిక చేయడం, తెలుగులో వారిద్దరూ కలిసి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను సొంతం చేసుకున్నారు.ఈవిడ ఏకాంగా 7 శత దినోత్సవ సినిమాలలో హీరోయిన్ గా నటించి మెప్పించింది.
వీరిద్దరు జంటగా అనేక సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.చివరికి వీరిద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని చివరికి పెళ్లి పీటలు ఎక్కారు.
నిజంగా కాలం ఎటు వెళ్లి ఎటు వైపు పయనిస్తుందో కదా.!
.