సినిమాలలో నటించాలని కోరిక ఎంతో మందికి ఉంటుంది.అయితే ఆ కోరిక కేవలం కొందరికి మాత్రమే నెరవేరుతుంది.
మరి కొందరికైత ఆ అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది.ఈ రెండో కోవకు చెందినదే రింకు రాజ్ గురు.2016 సంవత్సరంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన “సైరాట్” చిత్రంలో కథానాయికగా పరిచయమైంది.ఈ మరాఠీ సినిమాని తరువాత కన్నడలో రీమేక్ చేసి “మనసు మల్లిగే” అనే తదితర సినిమాల్లో నటించి ఈ సినిమాలను ఓటీటీ ద్వారా విడుదల చేయడంతో తన ప్రతిభను చాటుకుంది.
ప్రస్తుతం డిస్నీ స్టార్ వెబ్ సిరీస్ “హండ్రెడ్”లో నటించింది.
రింకు రాజ్ పుట్టి పెరిగింది మహారాష్ట్ర, షోలాపూర్ జిల్లా, అక్లుజ్, ఆమెకు సోదరుడు కూడా ఉన్నాడు.
ఈమె తల్లిదండ్రులు వృత్తిరీత్యా టీచర్లు కావడంతో తనకు కూడా ఎప్పుడూ చదువులో ముందుండేది.సైరాట్ విడుదలయ్యే సమయానికి రుంకు కేవలం 9వ తరగతి చదువుతూ ఉండటం ఎంతో విశేషం.
సినిమాలలో బిజీగా ఉండటంతో స్కూల్ కివెళ్లి చదువుకోడానికి ఇబ్బంది పడినప్పటికీ, ట్యూషన్ ల ద్వారా ఇంటర్ అభ్యాసాన్ని 82 శాతం మార్కులతో పూర్తి చేసింది.జంతువుల అంటే తనకు ఎంతో ఇష్టమని కష్టపడి చదివి వెటర్నరీ డాక్టర్ కావాలనేది ఆమె లక్ష్యమని తెలిపారు.
సినిమాలలోకి వచ్చి నటిని అవుతానని కలలో కూడా ఊహించలేదని తెలిపారు.తను నటించిన సైరాట్ సినిమా దర్శకుడు నాగరాజ్ ది, మాది ఒకే ఊరు కావడంతో నాకు అవకాశం వచ్చిందని తెలిపారు.
ఆడిషన్స్ కోసం ఒకసారి మా ఊరికి వచ్చి నన్ను చూడటం తో మా అమ్మా, నాన్నలను ఒప్పించాడు.ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నప్పుడు నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను అని తెలిపారు.
అయితే ప్రస్తుతం హండ్రెడ్ వెబ్ సిరీస్ లో లారా దత్తాతో పోటీపడి నటించిందని ప్రశంశలు రావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు.రింకు హండ్రెడ్ అనే వెబ్ సెరీస్ ద్వారా మాత్రమే కాకుండా చదువు ,నటన, సంగీతంలో కూడా హండ్రెడ్ పర్సెంట్ టాలెంట్ ఉందని నిరూపించుకున్నారు.