వరంగల్ జిల్లాలోని కాకతీయ మెడికల్ కాలేజీలో నిన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైద్య విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది.కాగా ప్రస్తుతం బాధిత విద్యార్థినికి హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స కొనసాగుతుంది.
అవయవాలు దెబ్బతినడంతో పాటు ప్రీతికి బ్రెయిన్ డ్యామేజ్ అయినట్లు తెలుస్తోంది.బాధితురాలికి అవయవాలు చాలా వరకు పని చేయడం లేదని, అంతేకాకుండా బీపీ కూడా సరిగ్గా మెయింటైన్ అవ్వడం లేదని వైద్యులు చెప్పారని సమాచారం.
కాగా ఇప్పటివరకు ప్రీతికి మూడు సార్లు సీపీఆర్ చేశారు.అయితే సీనియర్ డాక్టర్ల వేధింపులు తాళలేకనే ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.







