G7 సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోడీ ని ఆహ్వానించారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.ప్రతిసారి వివిధ దేశాల్లో జరగగా ఈసారి మాత్రం బ్రిటన్ దేశంలో ఈ సదస్సు జరగనుంది.
కాగా జరగబోయే G7 ఈ సదస్సులో ఇండియా తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా దేశాలకు బ్రిటన్ దేశం ఆహ్వానం పంపింది.
ఇదిలా ఉంటే ఉన్న కొద్ది అంతర్జాతీయ వేదికలపై ఇండియా ప్రభావం పెరుగుతుంది.
అంతర్జాతీయంగా వివిధ కూటముల శిఖరాగ్ర సమావేశాలకి రావలసిందిగా ఇండియాకు ఆహ్వానాలు అందడం విశేషం.తాజాగా ఈ ఏడాది గ్రూప్ సెవెన్ జరిగే సదస్సుకు ఇండియాకు ఆహ్వానం అందటం జరిగింది.
అంతర్జాతీయంగా ఆర్థికంగా అభివృద్ధి చెందిన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా దేశాలు G7 గా కూటమి కట్టాయి.అయితే వచ్చే జూన్ మాసంలో ఈ సారి బ్రిటన్ దేశంలో ఈ సదస్సు జరగనుంది.
ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత ప్రధాని మోడీ కి ఆహ్వానం అందించారు.కాగా ఈ సదస్సులో కరోనా వైరస్ ప్రభావం వలన ఎదురవుతున్న సవాళ్లు, వాతావరణ మార్పులు, సాంకేతిక పరమైన అభివృద్ధి, శాస్త్రీయ ఆవిష్కరణలు, స్వేచ్ఛ వాణిజ్యంపై చర్చ జరగనుందని సమాచారం.