అదృష్టం అనేది అందరి తలుపు తట్టదు.కానీ అదృష్టానికి చిరునామగా కొందరుంటారు.
వారిని ఎంత పొగిడిన తక్కువే అనిపిస్తుంది.అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే అతను ఒక్కరు.
ఎందుకంటే ఎవరికైన ఒక్కసారో, రెండో సారో లాటరీ తగులుతుంది.కానీ ఈ వ్యక్తికి ఏకంగా ఆరుసార్లు లాటరీ గెలిచి వార్తల్లో నిలిచాడు.ఇక ఆరోసారి లాటరీలోనే అత్యధికంగా నగదు సొంతం చేసుకున్నాడు.
ఏకంగా 2,50,000 డాలర్లు అంటే అది మన కరెన్సీలో అయితే అక్షరాల రూ.182 కోట్లు ఒక్క లాటరీలోనే సొంతం చేసుకోవడం విశేషం.మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.
ఇలా లాటరీల్లో సొంతం చేసుకున్న నగదును సమాజానికి వినియోగిస్తుండడం నిజంగా గొప్పగా చెప్పుకునే మాట.
ఇకపోతే అమెరికాలోని ఇదహో రాష్ట్రానికి చెందిన బ్రియాన్ మోస్ అనే తాజాగా క్రాస్ వర్డ్ స్క్రాచ్ గేమ్ ఆడాడట.ఇలా ఆ గేమ్లో రూ.182.26 కోట్లు నగదు బహుమతి సొంతం చేసుకున్నాడు.ఇంతవరకు బాగానే ఉన్నా ఇలా ఎవరికైనా లాటరీ తగిలితే జీవితంలో అనుభవించని సుఖాలు పొందడానికి ప్రయత్నిస్తారు.
కానీ బ్రియాన్ మోస్ మాత్రం సామాజిక కార్యక్రమాలకు, ప్రభుత్వ పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో సౌకర్యాల కల్పనకు వెచ్చిస్తున్నాడు.ఇలాంటి వారు డబ్బులుండి కూడా పిసినాసి లెక్కలు చేసే వారికి ఆదర్శం అని చెప్పవచ్చూ.