ప్రస్తుతం రంజాన్ నెల కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో ఈ నెలలో ముస్లిం సోదర, సోదరీమణులు చాలా నిష్ఠ గా ఉపవాసాలు ఉంటుంటారు.
కనీసం మంచి నీళ్ళు కూడా తీసుకోకుండా .దాదాపు 30 రోజుల పాటు కఠినంగా ఉపవాస దీక్ష చేస్తుంటారు.ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో నిరుపేద ముస్లిం కుటుంబాలకు ఏటా గిఫ్ట్ ప్యాకెట్లు అందజేస్తూ ఉంటుందన్న సంగతి తెలిసిందే.
దీనిలో భాగంగా ఈ ఏడాది భారీ ఎత్తున ఆయా జిల్లాలకు బహుమతులు అందించడం జరిగింది.
ప్రస్తుతం కోవిడ్ ఉద్రిక్తత ఎక్కువగా ఉండటంతో కరోనా నిబంధనల మేరకు మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బహుమతులు ప్రభుత్వ యంత్రాంగం అందజేస్తూ ఉంది.దీనిలో భాగంగా నిర్మల్ జిల్లాకు ఈసారి ఆరు వేల గిఫ్ట్ ప్యాకెట్లు అందించింది తెలంగాణ ప్రభుత్వం.
దీంతో ముస్లిం కుటుంబ సభ్యులు ప్రభుత్వం తమకిచ్చిన బహుమతుల బట్టి ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
.