ఇటీవల సమాజంలో యువతి, యువకులు ఆకర్షణకు లోనై ప్రేమ, సహజీవనం అంటూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.కనీసం కుటుంబ పెద్దలకు కాస్త కూడా గౌరవం ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకొని కొంతకాలం సరదాగా గడిపి.
ప్రేమికుల మధ్య గొడవలు వస్తే అవి హత్య చేసే వరకు తీసుకెళ్లి జీవితాలను నాశనం చేస్తున్నాయి.ఇద్దరు కలిసి ప్రేమించుకోవడం, పెళ్లికి ముందే సహజీవనం( coexistence ) పేరుతో ఎంజాయ్ చేయడం, కాస్త బెడిసి కొట్టిందంటే బ్రేకప్( breakup ) చెప్పుకోవడం లేదంటే దారుణాలు చేయడం ఈమధ్య ఓ ఫ్యాషన్ గా మారింది.
ఇలాంటి కోవకు చెందిన ఓ ప్రేమ కథ హత్యకు( murder ) దారితీసింది.ఆ వివరాలు ఏమిటో చూద్దాం.
గుంటూరు జిల్లా తెనాలిలోని కంఠవరం కాల్వ గట్టు ప్రాంతంలో గద్దె రాము( Gadde Ramu ) అనే వ్యక్తి తోపుడుబండిపై పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.ఇతనికి ఇంకా వివాహం కాలేదు.అయితే అదే ప్రాంతంలో ఉండే గొంతు బోయిన ఆమని( amani ) అనే మహిళతో పరిచయం కాస్త ప్రేమగా మారింది.గత మూడు సంవత్సరాలుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు.
గురువారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన రాము ఉదయానికే శవమై కనిపించడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.ఈ విషయం పోలీసులకు తెలియడంతో సంఘటన ప్రాంతాన్ని పరిశీలించి ఆమనిని విచారించారు.ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని నమ్మించే ప్రయత్నం చేయగా.పోలీసులకు కాస్త అవనుమానం వచ్చి వారి స్టైల్ లో విచారణ చేస్తే మద్యం మత్తులో ఉన్న రామును తానే గొంతు కోసి చంపినట్లు అంగీకరించింది.
పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించి, కేసు నమోదు చేసి ఆమనిని అదుపులోకి తీసుకున్నారు.ఈ సంఘటనపై పోలిసులు చుట్టుపక్కల వారిని కూడా విచారిస్తున్నారు.