ప్రేమే ప్రపంచంగా కలలు కంది.తనే జీవితం అనుకుంది.
కొన్నాళ్ల తర్వాత ముఖం చాటేశాడు ఆ అబ్బాయి.మాటలు ఆగిపోయాయి.
ఫోన్ కు కాల్స్ రావడం నిలిచిపోయింది.భరించలేని బాధ.ఒక్కసారిగా ఒంటరి అయిపోయింది.గుండెను పిండేసే బాధతో, కన్నీటి పర్యంతమైంది.
నమ్మిన పాపానికి మోసపోయానని బాధపడుతూ.చివరకు తన ప్రాణాలు లెక్కచేయకుండా తిరిగి రాని లోకానికి వెళ్లిపోయింది ఆ అమ్మాయి.
హైదరాబాద్ లోని ఛాదర్ ఘాట్ అజంపురా ఏరియాలో ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది.17 ఏళ్ల బాలిక ప్రేమించి.నమ్మి మోసపోయిన పాపానికి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.మోసపోయి ఒంటరిగా మిగిలిన ఆమె జీవితాన్ని చీకటి కమ్మెసింది.ఉరుకుల పరుగుల జీవితంలో ఇంట్లో వాళ్లు కూడా గమనించని పరిస్థితి.చదుకోవాల్సిన వయసులో ప్రేమించింది.
తనే సర్వస్వం అని నమ్మింది… చివరికి ఘోరంగా మోసపోయి చావే దిక్కను కుంది.ఇంట్లోకి వెళ్లి ఉరేసుకున్నా చాలా సమయం తర్వాత తల్లిదండ్రులకు అమ్మాయి మీద ధ్యాస మళ్లీంది.
తలుపు తట్టి చూశారు.పిలిచినా పలకలేదు.
తలుపు బద్ధలు కిట్టి లోనికి ప్రవేశించారు.తీరా చూస్తే ఆ అమ్మాయి శవమై కనిపించింది.
ఈ ఘటనను చూసి ఇంట్లో వాళ్ల గుండెలు భారమయ్యాయి.ఆ క్షణం ఆ ఇళ్లలో చీకటి కమ్ముకొచ్చింది.
తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.వారి గోడును విన్న స్థానికులు పరిగెత్తుకుంటూ వాళ్ల ఇంటి ముందు చేరారు.
కుటుంబ బాధను చూసి స్థానికులు ఆవేదన చెందారు.
స్థానికులు పోలీసులు సంప్రదించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
అమ్మాయి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.తల్లిదండ్రుల ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు.
క్లూస్ టీం సాయంతో విచారణ మొదలుపెట్టారు.త్వరలో మైనర్ బాలిక చావుకి కారణమైన వాడిని పట్టుకుని శిక్షిస్తామని పోలీసులు తెలిపారు.