ఈ మధ్య అమ్మాయిల మీద జరుగుతున్న దారుణాలను నిత్యం చూస్తూనే ఉన్నాం.వావి వరసలు మర్చిపోయి మరీ దారుణాలకు పాల్పడుతున్నారు దుర్మార్గులు.
ఎన్ని ఉదంతాలు వెలుగు చూసినా ఎలాంటి శిక్షలు విధిస్తున్నా కూడా దేశంలో ఈ దారుణమైన అత్యాచారాల పర్వం మాత్రం ఇంకా ఆగకపోవడం విచారకరం.కామాంధులు ఎప్పుడూ ఏదో రకంగా రెచ్చిపోతూ అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నారు.
ఇక తాజాగా ఉత్తర ప్రదేశ్లో జరిగిన దారుణం ప్రతి ఒక్కరినీ కలిచి వేస్తోంది.ఈ మధ్య ఊపీలో విపరీతంగా ఇలాంటి అత్యాచార ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
ఇక ప్రస్తతుం ఓ పేద అమ్మాయిని కొందరు మోసపూరిత మాటలతో సాయం చేస్తామని నమ్మించారు.తనకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లుఇప్పిస్తామంటూ తీసుకెళ్లి చివరకు దారుణానికి పాల్పడ్డారు.
ఓ ఇద్దరు యువకులు ముందస్తు ప్లాన్ ప్రకారం అన్ని రెడీ చేసుకుని తమకు తెలిసిన ఓ అమ్మాయి దగ్గరకు వెళ్లారు.తాము ఎలాగైనా ఇల్లు ఇప్పిస్తామని నమ్మించి చివరకు ఆమెను పొలాల్లోకి తీసుకెళ్లి ఆమె మీద అత్యాచారం చేయడం పెను సంచలనం రేపుతోంది.
ఇలా దారుణం చేసిన తర్వాత వారిద్దరూ అక్కడినుంచి పారిపోయి ఆమెను అక్కడే విడిచిపెట్టారు.
కాగా ఆ ఇద్దరి పేర్లు యోగేశ్ కుమార్, బబ్లు అని తెలుస్తోంది.ఇలా అత్యాచారం చేసే సమయంలో ఆ ఇద్దరూ అమ్మాయిని బెదిరించారని బలవంతంగా అత్యాచారం చేశారని ఇందులో ఒక యువకుడు దీన్నంతా ఫొన్లో రికార్డు చేశారని పోలీసులు తెలిపారు.ఇలా వీడియోతో చూపించి ఆ తర్వాత కూడా ఆమెను వేధించడం స్టార్ట్ చేశారు.
ఇలా పలుమార్లు ఆమె మీద అత్యాచారం చేసి వీడియోను తొలగిస్తామని నమ్మించారు.కానీ తొలగించకపోవడంతో ఆమె చేసేది లేక పోలీసులను ఆశ్రయించింది.
దీంతో పోలీసులు వారి మీద కేసు నమోదు చేసి బాధితురాలిని ఆస్పత్రిలో జాయిన్ చేశారు.