లోకంలో చావు అనేది చాలా తేలికమైనదిగా మారిపోయింది.ఎందుకంటే జీవితంలో ఎదురయ్యే గోరంత సమస్యలను కూడా భరించలేని స్దాయికి వెళ్లుతున్న మనుషులు చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్యలను పరిష్కార మార్గంగా ఎన్నుకోవడం దురదృష్టకరం.
ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు మందలించినా,చదువుల్లో అనుకున్న రీతిలో మార్కులు సాధించ లేకపోయినా, లేక ప్రేమలో ఫేలయ్యామని, ఆర్ధికంగా నష్ట పోయామని చివరికి తాము అనుకున్న పనులు జరగడం లేదని ఇలా పలురకాల కారణాలతో ప్రాణం విలువ గ్రహించక బలవంతంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ఇలాంటి అనాలోచిత నిర్ణయం కారణంగా 9 వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాలలో నివాసం ఉంటున్న సిందూజా అనే విద్యార్ధిని తన తల్లిదండ్రులు సెల్ ఫోన్ కొనివ్వలేదని చెట్టుకు ఉరి వేసుకుని మరణించి కన్నవారికి తీరని శోకాన్ని మిగిల్చింది.
ఎంతో భవిష్యత్తు ఉన్న నేటి కాలపు యువతి యువకులు ఇలా అనవసరమైన విషయాలకు ప్రాణాలను పణంగా పెట్టడం నిజంగా బాధాకరం.