మరో 48 గంటల్లో నాగార్జున నటించిన ది ఘోస్ట్ మూవీ థియేటర్లలో విడుదల కానుందనే సంగతి తెలిసిందే.నాగ్ వరుస ఇంటర్వ్యూలతో ది ఘోస్ట్ సినిమాపై అంచనాలు పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
ఈ సినిమాకు 16 కోట్ల రూపాయల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా.ది ఘోస్ట్ నైజాం హక్కులు 5.5 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.ఈ సినిమా సీడెడ్ హక్కులు 2.5 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం.
కర్ణాటకలో ది ఘోస్ట్ హక్కులు కేవలం 65 లక్షల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.ఈ సినిమా ఓవర్సీస్, రెస్టాఫ్ ఇండియా హక్కులు మాత్రం 4.5 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని బోగట్టా.ది ఘోస్ట్ ఆంధ్ర హక్కులు 8 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.తెలుగు రాష్ట్రాల వరకు ఈ సినిమా హక్కులు 16 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్టు సమాచారం అందుతోంది.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 21.15 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది.ఈ సినిమా ఫుల్ రన్ లో 22 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధిస్తే హిట్ అనిపించుకుంటుంది.మరి ఈ సినిమాకు ఆ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయో లేదో చూడాల్సి ఉంది.
ది ఘోస్ట్ సినిమా కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధిస్తుందని నాగార్జున నమ్ముతున్నారు.నాగార్జున కొత్త ప్రాజెక్ట్ లను ఇప్పట్లో ప్రకటించబోరని తెలుస్తోంది.
ఆరు నెలల పాటు విశ్రాంతి తీసుకోనున్న నాగార్జున ఆ తర్వాత కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారు.ఓటీటీ ప్రాజెక్ట్ లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నాగార్జున భావిస్తున్నట్టు తెలుస్తోంది.సినిమాసినిమాకు నాగార్జున రేంజ్ పెరుగుతుండగా నాగార్జున తర్వాత ప్రాజెక్ట్ లు బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తాయో చూడాలి.నాగ్ అభిమానులు ఈ సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.