ప్రెజెంట్ ట్రెండ్ అంతా సోషల్ మీడియాపై నడుస్తుంది అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.ఎందుకంటే సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్లు గాని వీడియోలు గాని క్షణాల్లో వైరల్ గా మారిపోతున్నాయి.
ఇటీవలి కాలంలో ఒక అమ్మాయి కట్టెల పొయ్యి మీద రోటీలు చేస్తూ ఉన్న వీడియో ఎంత ఫేమస్ అయిందో మీ అందరికి తెలిసే ఉంటుంది.ఆ అమ్మాయి ఎవరో… ఏంటో అనే వివరాలు తెలియక పోయిన ఆ వీడియో అయితే రాత్రికి రాత్రే సోషల్ మీడియాను ఒక ఊపు ఆపేసి మిడ్ నైట్ స్టార్ ని చేసేసింది.
ఆ అమ్మాయికి సంబందించి ఆ రోటి చేసే వీడియో తప్పా మరే వీడియో గాని ఫోటోలు గాని లేవు.ఆ అమ్మాయి నవ్వుకి, అందానికి ఎంతోమంది ఫిదా అయిపొయి అసలు ఆ అమ్మాయి ఎవరు.? ఏంటి.? అనే ఆరాలు తీయడం మొదలుపెట్టారు.కానీ., ఆ అమ్మాయి ఆచూకీ మాత్రం ఎక్కడా కనిపించలేదు.అయితే గత కొన్నాళ్లుగా ఆ అమ్మయి గురించి ఆరా తీసే అభిమానులకు ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
ఎందుకంటే ఆ రోటీ అమ్మాయి ఎవరో, ఎక్కడ ఉంటుందో అనే వివరాలు తెలిసిపోయింది.
ఆ అమ్మాయి మన దేశానికీ చెందిన యువతీ కాదు. పాకిస్తాన్ లోని కరాచీ ప్రాంతానికి చెందిన యువతిగా తెలిసింది.
ఈ యువతి పేరు అమీనా రియాజ్.ఆమె వయస్సు 15 సంవత్సరాలు.
ఈ అమ్మాయి ప్రతి రోజు తన కుటుంబం కోసం కట్టెల పొయ్యి మీద రోటీలు చేస్తు ఉంటుందట.అయితే ఈ క్రమంలో ఒకరోజు రోటీలు చేస్తుండగా వారి బంధువుల కుర్రాడు ఆమెను వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఇంకేముంది ఆ యువతీ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.వీడియోలోని ఆ యువతి నవ్వుకి నెటిజన్లు మైమరిచిపోయారు అంటే నమ్మండి.
ఇంతకీ ఈ యువతీ ఎవరా అని ఆరా తీసిన పాత్రికేయులుకు ఆమె గురించిన సమాచారం తెలియగా, వాళ్ళు ఆ అమ్మాయి ఉండే ప్రాంతానికి వెళ్లారు.ఆ యువతితో, యువతి కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేయగా వారు మాత్రం వీడియోలో కనపడేందుకు ఇష్టపడలేదు.ఇంకో విషయం ఏంటంటే అమీనాకు ఇన్స్టాగ్రామ్ ఖాతా కూడా ఉంది.ఆమెను అందులో దాదాపు 3 లక్షల మంది దాక ఫాలో అవుతున్నారు.అందులో మన భారతీయులు కూడా అధికంగానే ఉన్నారని తెలుస్తుంది.