ప్రస్తుతం ఎక్కడ చూసినా పర్యావరణానికి హాని కలిగించే చర్యలే కనపడుతున్నాయి.ఎటు చూసినా కాలుష్యం దర్శనమిస్తోంది.
గాలి, వాయు, నీటి కాలుష్యం రూపంలో పర్యావరణం మొత్తం నాశనం అవుతోంది.ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి విడుదలయ్యే కాలుష్య ఉద్గారాలతో పర్యావరణానికి ఇబ్బంది కలుగుతోంది.
దీంతో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల పట్ల దృష్టిసారిస్తున్నారు.అలాంటి వారికి భారీగా సబ్సిడీలు ఇచ్చి, ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి.
తాజాగా ఫ్రాన్స్ ప్రభుత్వం కూడా ఇదే తరహాలో ప్రజలకు బంపరాఫర్ ప్రకటించింది.దీంతో ప్రజలు ఎలక్ట్రిక్ బైక్లను విరివిగా కొనుగోలు చేస్తున్నారు.
దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
ఫ్రెంచ్ ప్రభుత్వం గత సంవత్సరం సరికొత్త విధానం అమలులోకి తీసుకొచ్చింది.
ఎలక్ట్రిక్ బైక్లు (వెలోస్ అసిస్టెన్స్ ఎలెక్ట్రిక్ లేదా VAE), కార్గో బైక్లను కొనుగోలు చేసేలా ప్రజలను ప్రోత్సహించే లక్ష్యంతో అనేక చర్యలను అవలంబించింది.వీటిలో ఎలక్ట్రిక్, కార్గో బైక్లకు ప్రస్తుతం ఉన్న ప్రైమ్ లా మార్పిడి యొక్క పొడిగింపు మరియు తరువాతి వాటికి బోనస్ వెలో ఉన్నాయి.
పర్యావరణ అనుకూలమైన మోడల్ల కోసం తమ కార్లు లేదా వ్యాన్లను మార్చుకోవాలనుకునే వ్యక్తులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.ఎలక్ట్రిక్, కార్గో బైక్ కోసం వారి తక్కువ శక్తి సామర్థ్యపు కారు లేదా వ్యాన్ను మార్పిడి లేదా స్క్రాప్ చేయాలనుకునే వ్యక్తులకు దీంతో లాభం కలగనుంది.
పాతవి, ఎక్కువ కాలుష్యం కలిగించే మోడల్లను ఇచ్చేసి, ప్రభుత్వం నుంచి €1,500 వరకు పొందవచ్చు.పొందొచ్చు.కొన్నింటికి గరిష్టంగా €4,000 అంటే భారతీయ కరెన్సీలో రూ.3.2 లక్షలను సబ్సిడీగా అందజేస్తోంది.దీంతో క్రమంగా పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ బైక్ల వినియోగానికి ప్రజలు అలవాటు పడుతున్నారు.