ఎవరైనా నీటిలో చేపలు పడదామని వలలు వేస్తూ ఉంటారు మత్సకారులు.అలానే ఒక మత్సకారుడు కూడా చేపలు పట్టుకుందాం అన్నట్లు గా వల వేస్తె విచిత్రం చేపల బదులు ఆ వలలో పాములు పడడం విశేషం.
ఈ ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలోని చెరువులో చోటుచేసుకుంది.స్థానిక మత్సకారుడు చేపలు పడదామని ఉదయమే చెరువులో చేపల వేటకు అని వెళ్ళాడు.
వెళ్లిన తరువాత చెరువులో వల వేసేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు.అయితే సాయంత్రానికి వలలో చేపలు పడిఉంటాయి అని భావించి చెరువు గట్టు వద్దకు వెళ్ళాడు.
తీరా వల తీసి చూడగా అతడు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు.ఆ వలలో చేపల కంటే ఎక్కువగా పాములు పడడం తో ఆ మత్సకారుడు ఆశ్చర్యపోయాడు.
అయితే వాటిని చూసి భయపడినప్పటికీ అవన్నీ కూడా వలలోనే చనిపోయి ఉండడం తో అతడు ఊపిరి పీల్చుకున్నాడు.చేపలతో పాటు ఆ వలలో సుమారు 40 పాములు ఉన్నట్లు తెలుస్తుంది.అయితే వలలో పడిన పాములు అన్నీ కూడా నీటి పాములు అని స్థానికులు చెబుతున్నారు.పాపం చేపల వేటకు అని వెళ్లిన ఆ మత్సకారుడుకి చేపలతో పాటు పాములు కూడా దర్శనమిచ్చాయి.