టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ బుట్ట బొమ్మ పూజా హెగ్డే.ప్రస్తుతం ఈ అమ్మడి క్రేజ్ టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.
అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని అందుకుంది.ఎన్నో సినిమాలలో మంచి సక్సెస్ అందుకొని స్టార్ హీరోయిన్ గా నిలిచింది.
ఎంతోమంది అభిమానుల హృదయాలను దోచుకుంది.ఇంత బిజీ లైఫ్ లో ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం కాస్త సమయాన్ని గడుపుతుంది.ఇదిలా ఉంటే అగ్రహీరోలందరికీ పూజా హెగ్డే మొదటి ఆప్షన్ గా మిగిలింది.
2010లో సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ2014లో ముకుంద సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఆ తర్వాత ఒక లైలా కోసం సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకుంది.ఇక నిజానికి దర్శకనిర్మాతలు కూడా పూజా హెగ్డే ను ఎంతో సెంటిమెంట్ గా భావిస్తారు.
అలా వైకుంఠపురంలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ బుట్ట బొమ్మఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది.
ప్రస్తుతం టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో హీరో రామ్ చరణ్ సరసన నటిస్తుంది.అక్కినేని అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటించగా ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.అంతేకాకుండా ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.
మరోవైపు బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటిస్తున్న కబీ ఈద్ కబీ దీవాలి సినిమాలో నటిస్తుంది.ఇక రణ్ వీర్ సింగ్ నటిస్తున్న సర్కస్ సినిమాలో కూడా బిజీగా ఉంది.ఇవే కాకుండా తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న బీస్ట్ సినిమాలో కూడా నటిస్తుంది పూజ.మొత్తానికి మూడు భాషలలో బాగా ఏలుతున్న ఈ బ్యూటీ అగ్రహీరోల అందరికీ మొదటి ఆప్షన్ గా నిలిచింది.