దేశంలో కరోనా వ్యాక్సినేషన్ పక్రియ విజయవంతంగా కొనసాగుతుంది.టీకా వేయడం మొదలు పెట్టిన రోజుల కంటే ఇప్పుడున్న రోజుల్లో చాలా మంది ప్రముఖులు కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం పట్ల ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ క్రమంలో దాదాపు అన్ని రంగాల్లో ముఖ్యులుగా ఉన్న వారందరు కోవిడ్ టీకా ఇప్పించుకున్నారు.
ఇకపోతే తెలంగాణ సీయం కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.
ఈ రోజు ఉదయం హైదరాబాద్లోని నిమ్స్ హస్పిటల్లో కరోనా టీకా మొదటి డోసు వేయించుకున్నారు.టీకా తీసుకున్న అనంతరం కవితా మాట్లాడుతూ వ్యాక్సిన్ తీసుకోవడంలో ఎలాంటి అపోహలు వద్దని, అర్హులైన ప్రతి ఒక్కరు టీకా తీసుకోవాలని, అలాగే కరోనా నిబంధలను తప్పకుండా పాటించుకోవాలని ప్రజలను కోరారు.
ఇక కవిత భర్త అనిల్కు ఇటీవల కరోనా పాజిటివ్ నిర్దారణ అవ్వగా, వీరి కుటుంబ సభ్యులంతా హోం క్వారంటైన్లో ఉన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే కవిత కరోనా టీకా ఇప్పించుకున్నారు.