కరోనా టీకా మొదటి డోసు తీసుకున్న ఎమ్మెల్సీ కవిత.. !

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ పక్రియ విజయవంతంగా కొనసాగుతుంది.టీకా వేయడం మొదలు పెట్టిన రోజుల కంటే ఇప్పుడున్న రోజుల్లో చాలా మంది ప్రముఖులు కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం పట్ల ఆసక్తి చూపిస్తున్నారు.

 Telangana, Mlc Kavita, Corona Vaccine, First Dose,latest  News-TeluguStop.com

ఈ క్రమంలో దాదాపు అన్ని రంగాల్లో ముఖ్యులుగా ఉన్న వారందరు కోవిడ్ టీకా ఇప్పించుకున్నారు.

ఇకపోతే తెలంగాణ సీయం కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు.

ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని నిమ్స్‌ హస్పిటల్లో కరోనా టీకా మొదటి డోసు వేయించుకున్నారు.టీకా తీసుకున్న అనంతరం కవితా మాట్లాడుతూ వ్యాక్సిన్ తీసుకోవడంలో ఎలాంటి అపోహలు వద్దని, అర్హులైన ప్రతి ఒక్కరు టీకా తీసుకోవాలని, అలాగే కరోనా నిబంధలను తప్పకుండా పాటించుకోవాలని ప్రజలను కోరారు.

ఇక కవిత భర్త అనిల్‌కు ఇటీవల కరోనా పాజిటివ్ నిర్దారణ అవ్వగా, వీరి కుటుంబ సభ్యులంతా హోం క్వారంటైన్‌లో ఉన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే కవిత కరోనా టీకా ఇప్పించుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube