లోకంలో మూఢ నమ్మకాల పేరుతో జరుగుతున్న దారుణాలను చూస్తుంటే.కంప్యూటర్ యుగంలో కూడా వీరి పిచ్చి పీక్ స్టేజీలో వెళ్లడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఏది నిజమో, ఏది అబద్ధమో గ్రహించకుండా కన్న అయిన వారిని కూడా ఈ మూఢ నమ్మకాలకు బలిచేస్తూ సమాజాన్ని హేళన చేస్తున్నారు కొందరు.
ఇక తాజాగా తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఇలాంటి దారుణం చోటు చేసుకుంది.
ఆ వివరాలు చూస్తే.రామనాథపురంలో నివసించే వీరసెల్వంకు మూఢాచారాల పట్ల నమ్మకాలు ఎక్కువట, తాంత్రీక పూజలను కూడా నమ్ముతాడట.
ఈ క్రమంలో తన కూతురు తరుణి(19) అనే యువతికి గత కొన్ని రోజుల నుంచి తీవ్రమైన అనారోగ్యంగా ఉండటంతో, మరణించిన తన భార్య ఆత్మ ఆమెను ఆవహించిందని భావించినా ఆ తండ్రి ఆ ఆత్మను బయటకు పంపించాలని తాంత్రిక పూజలు చేయడం ప్రారంభించాడట.
ఈ క్రమంలో ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే తరుణి మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారట.
అదీగాక ఆమె అనారోగ్యానికి కారణం టైఫాయిడ్ అని దీని వల్లే ఆమె మృతిచెందిందని తెలిపారట.కాగా ఆ తండ్రి సకాలంలో గనుక ఆస్పతిలో చేరిపిస్తే ఆ యువతి బ్రతికేదని మూఢనమ్మకాలతో నిండు ప్రాణం గాల్లో కలిసిపోయిందని వారు పేర్కొన్నారు.
ఇకపోతే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారట.