మూఢ నమ్మకాల పేరుతో ఓ తండ్రి కన్న కూతురునే.. ?

లోకంలో మూఢ నమ్మకాల పేరుతో జరుగుతున్న దారుణాలను చూస్తుంటే.కంప్యూటర్ యుగంలో కూడా వీరి పిచ్చి పీక్ స్టేజీలో వెళ్లడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

 The-father Who Killed The Daughter In Superstitio Tamil Nadu, Ramanathapuram, Fa-TeluguStop.com

ఏది నిజమో, ఏది అబద్ధమో గ్రహించకుండా కన్న అయిన వారిని కూడా ఈ మూఢ నమ్మకాలకు బలిచేస్తూ సమాజాన్ని హేళన చేస్తున్నారు కొందరు.

ఇక తాజాగా తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఇలాంటి దారుణం చోటు చేసుకుంది.

ఆ వివరాలు చూస్తే.రామనాథపురంలో నివసించే వీరసెల్వంకు మూఢాచారాల పట్ల నమ్మకాలు ఎక్కువట, తాంత్రీక పూజలను కూడా నమ్ముతాడట.

ఈ క్రమంలో తన కూతురు తరుణి(19) అనే యువతికి గత కొన్ని రోజుల నుంచి తీవ్రమైన అనారోగ్యంగా ఉండటంతో, మరణించిన తన భార్య ఆత్మ ఆమెను ఆవహించిందని భావించినా ఆ తండ్రి ఆ ఆత్మను బయటకు పంపించాలని తాంత్రిక పూజలు చేయడం ప్రారంభించాడట.

ఈ క్రమంలో ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే తరుణి మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారట.

అదీగాక ఆమె అనారోగ్యానికి కారణం టైఫాయిడ్ అని దీని వల్లే ఆమె మృతిచెందిందని తెలిపారట.కాగా ఆ తండ్రి సకాలంలో గనుక ఆస్పతిలో చేరిపిస్తే ఆ యువతి బ్రతికేదని మూఢనమ్మకాలతో నిండు ప్రాణం గాల్లో కలిసిపోయిందని వారు పేర్కొన్నారు.

ఇకపోతే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube