తల్లిదండ్రుల ప్రేమ చాల గొప్పది.వారి ప్రేమ వెలకట్టలేనిది.
తాజాగా ఓ తండ్రి తన కొడుకుపై ఉన్న ప్రేమను వినూత్నంగా చాటుకున్నాడు.ఇటీవల అతని కొడుకు మరణించాడు.
చనిపోయిన కొడుకు కలను నెరవేర్చాలనుకున్నారు.ఇక అతడి కొడుకు ఫోటోను పట్టుకొని సినిమా థియేటర్ కి వచ్చాడు.
ఈ ఘటన కర్ణాటకలోని మైసూర్లో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే మైసూరు కువెంపు నగరకు చెందిన మురళీధర్ అనే వ్యక్తి కుమారుడు హరికృష్ణన్ హీరో పునీత్ రాజ్కుమార్కు వీరాభిమాని.
అతని సినిమాలంటే విపరీతమైన పిచ్చి.పునీత్ రాజ్కుమార్ సినిమా విడుదలైనదంటే ఫస్ట్ రోజు చూడాల్సిందే.అయితే పునీత్ రాజ్కుమార్ తాజా చిత్రం యువరత్న ఏప్రిల్ 1న విడుదలయింది.పునీత్ రాజ్కుమార్ అంటే చాలా ఇష్టపడే హరికృష్ణన్ ఈ సినిమా విడుదల కోసం ఎంతగానో వెయిట్ చేశాడు.
అయితే సినిమా విడుదలకు ముందే మురళీధర్ ఓ ప్రమాదంలో మరణించాడు.
అయితే నాలుగు నెలల క్రితం స్నేహితుడితో కలిసి వరుణ కాలువలో ఈతకు వెళ్లి నీట మునిగి చనిపోయాడు.హరికృష్ణన్ మరణంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.అయితే అతడి తండ్రికి మాత్రం కొడుకు బతికి ఉన్నప్పుడు చెప్పిన మాటలు అలా గుర్తుండిపోయాయి.
యువరత్న సినిమా విడుదలైన రోజే చూడాలని కొడుకు తనతో చెప్పిన మాటలను మురళీధర్ మనసులో మెదులుతూనే ఉన్నాయి.ఈ క్రమంలోనే ఏప్రిల్ 1వ తేదీన యువరత్న సినిమా విడుదలైంది.
ఇక మురళీధర్ తన కొడుకు ఫొటోతో పాటుగా యువరత్న సినిమా ఆడుతున్న థియేటర్కు వెళ్లాడు.మురళీధర్తో పాటు అతని భార్య, మరో కుమారుడు వచ్చారు.
ఇలా వారు సినిమా థియేటర్కు వెళ్లి నాలుగు టికెట్లు తీసుకుని సినిమా చూశారు.అయితే మురళీధర్ కుటుంబం ఫొటోతో సినిమా థియేటర్కు రావడంతో అక్కడున్న వారు ఏమిటా అని ఆరా తీయగా అసలు విషయం చెప్పారు.
కొడుకు ఫోటోతో కలిసి యువరత్న సినిమా చూడటం ద్వారా అతని ఆశ తీర్చినట్టు భావించాడు మురళీధర్.