దుర్మార్గులకు పాపభీతి ఉండదంటారు ఎందుకంటే వారు చేసే నికృష్టమైన పనుల్లో తనపర బేధం కూడా ఉండదు.కోపం వస్తే, బుద్ధి మందగిస్తే ఎంతటి దారుణానికైన తెగబడతారు.
ఇలాంటి ఒక దుర్మార్గుడు కన్నబిడ్దనే కౄరంగా చంపాడు.
మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో జరిగిన ఈ ఘటన తల్లిగా మారిన ప్రతి స్త్రీని కంటతడి పెట్టిస్తుంది.
ఆ వివరాలు చూస్తే.గోండియా జిల్లాలోని లూనారాలో నివాసముంటున్న వివేక్ ఊయికే (28) అనే వ్యక్తి తన బిడ్డ ఆగకుండా ఏడుస్తోందని తలుపులకేసి బాదాడట.
అంతటితో ఆగకుండా ఇంటి మెట్లపైకి కూడా విసిరికొట్టగా ఆ చిన్నది సడెన్గా ఏడుపు ఆపడంతో భయపడిపోయిన ఇతని భార్య పసిదాని దగ్గరికి వెళ్లి చూసిందట.
తలకు గట్టిగా దెబ్బతగలడంతో అపస్మారక స్దితిలోకి వెళ్లిన బిడ్ద ఆ తల్లికి కనిపించడంతో భయంతో వెంటనే తిరోడా సబ్ జిల్లా ఆస్పత్రికి పసిబిడ్దను పట్టుకుని వెళ్లిందట.అయితే ఆ ఆస్పత్రికి చేరుకునే సమయానికే ఈ చిన్నదాని ప్రాణాలు గాల్లో కలసిపోయాయట.కేవలం తండ్రికి వచ్చిన కోపానికి అభం శుభం తెలియని ఆ పాప ప్రాణం పోయింది.
ఓ తల్లికి కడుపుకోత మిగిలింది.