చాలా మంది ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాదు.మరి కొంత మంది వ్యాపారంలో ఎంత కష్ట పడినా ఫలితం ఉండదు.ఇలాంటి వారికి చాలా మంది చెబుతుంటారు.అదృష్టం ఉండాలని.అదృష్టం ఉంటే ఏమైనా చేయొచ్చు అంటున్నారు.అదృష్టం ఉంటే పట్టుకున్నదల్లా బంగారం అవుతుంది అంటుంటారు.
ఇలాంటి ఘటనే అమెరికాలో జరిగింది.కుమారుడు చేసిన తప్పు తండ్రిని కోటిశ్వరుడిని చేసింది.ఆ తండ్రి ఏకంగా రూ.7 కోట్ల లాటరీని గెలుచుకున్నారు.51ఏండ్ల ప్రిన్స్ జార్జ్ అది ఎలా జరిగిందో మీడియాకు తెలిపారు.తన కుమారుడిని రోజువారీగా స్కూల్కు తీసుకెళ్లాను.
అనుకోకుండా తన కారులో తన కొడుకు జాకెట్ డోర్లో ఇరుకుపోయింది.దానిని బయటికి తీసే క్రమంలో మురికిగా మారింది.
ఆ జాకెట్ శుభ్రం చేయడానికి డ్రై క్లీనర్ షాపులోకి వెళ్లాం అని కథ చెప్పారు.
జాకెట్ను శుభ్రం చేయడానికి షాపులోకి వెళ్లి శుభ్రం చేస్తూ అక్కడ ఉన్న టీవీలో ఓ కార్యక్రమం చూశాడు.
అప్పుడు అతనిఖీ $ 2 ఖరీదు చేసే లాటరీ టికెట్ తాను కొనుగోలు చేసినట్టు గుర్తుకువచ్చింది.తన వద్ద ఉన్న లాటరీ నెంబర్ చూసుకున్నారు.ఇప్పుడు తెలిసింది అతనికి తాను లాటరీ గెలుచుకున్నానని.తన వద్ద ఉన్న లాటరీకి రూ.7కోట్ల జాక్పాట్ వచ్చింది.ఒకే దెబ్బకు జార్జి కోటిశ్వరుడు అయ్యాడు.
టీవీలో చూస్తే గాని నాకు తెలియలేదు.నేను కూడా లాటరీ టికెట్ కొనుగోలు చేశానని, లాటరీ నెంబర్ చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యాను.ఎందుకంటే నా దగ్గర ఉన్న లాటరీకి రూ.7కోట్లు వచ్చిందని తెలిసింది.లాటరీ ద్వారా వచ్చిన డబ్బుతో పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టేస్తాను కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండడానికి ఖర్చు చేస్తాను.అంతేకాకుండా సెలవు రోజులలో టూర్కు వెళ్తామని మీడియాకు వివరించాడు.