యాంకర్ సుమ తరువాత అంత క్రేజ్ ను సంపాదించుకున్న యాంకర్ ఎవరైనా ఉన్నారంటే అనసూయ అని చెప్పవచ్చు.తన అందచందాలతో కుర్రకారు మతిపోగొడుతూ జబర్దస్త్ లాంటి కామెడీ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు అమితంగా దగ్గరైన అనసూయ, వెండి తెర మీద ఐటమ్ సాంగ్స్ తో వెండితెర అభిమానులను ఆకట్టుకుంటోంది.
అప్పుడప్పుడు వెండి తెరపై నటనా ప్రాధాన్యమైన పాత్రలు ఎంచుకుంటూ తనలోని నటనతో రంగస్థలం సినిమాలో నటన ప్రాధాన్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించింది.అయితే ఇటు సోషల్ మీడియాలోనూ అనసూయ యాక్టివ్ గా తన అభిమానులతో ఎప్పుడు టచ్ లో ఉంటుందన్న విషయం తెలిసిందే.
అయితే తాజాగా సోషల్ మీడియాలో అభిమాని అనసూయకు భారీ షాక్ ఇచ్చాడు.అనసూయకు సైతం అందుబాటులో లేని ఓ పాత ఫోటోను అభిమాని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసాడు.
అది అనసూయ భర్త భరద్వాజ్ ఎన్సీసీలో అనసూయతో కలిసి దిగిన ఫోటో.ఇక అభిమాని ఇచ్చిన ఈ గిఫ్ట్ తో ఆశ్చర్య పడింది.
మా ప్రయాణం అప్పటినుండే స్టార్ట్ అయిందంటూ అనసూయ ఎమోషనల్ అయింది.ఏది ఏమైనా అభిమాని ఇచ్చిన సర్ప్రైజ్ కు అనసూయ ఫిదా అయిపోయిందనే చెప్పవచ్చు.