భయం మనిషిని బ్రతికుండగానే మరణించేలా చేస్తుంది.ప్రస్తుతం కరోనా అనే వైరస్ కూడా ప్రజల్లో భయాన్ని నింపింది.
అందువల్ల వైరస్ సోకిన వారికంటే ఈ భయంతో మరణిస్తున్న వారే కనిపిస్తున్నారు.కాబట్టి కరోనా వచ్చిందని భయపడటం కంటే దానీ నుండి ఎలా బయటపడాలనే ఆలోచనతో ధైర్యంగా ముందడుగు వేయడం మంచింది.
ఇక క్రమం తప్పకుండా సరైన సూచనలు పాటిస్తూ ఎక్కడికి కదలకుండా ఇంట్లో ఉండే ఈ కరోనా వ్యాప్తిని, వైరస్ను కూడా వీలైనంతగా అరికట్టవచ్చూ.
ఇకపోతే కోవిడ్ ప్రస్తుతం అందరికి చాలా సులువుగా అంటుకుంటుంది.
ఈ క్రమంలో దీని బారిన ఒక్కరు కాదు ఇద్దరు కాదు లక్షల మంది పడుతున్నారు.అయితే తాజగా ప్రముఖ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ ఆయన సతీమణి కూడా కరోనా బారిన పడినట్లు సమాచారం.
కాగా ఈ విషయాన్ని భాగ్యరాజ్ కుమారుడు శాంతను భాగ్యరాజ్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.అదీగాక ఈ మధ్య కాలంలో మమ్మల్ని కలిసిన వారందరు తప్పక కోవిడ్ పరీక్షలు చేయించుకోండి అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు శాంతను భాగ్యరాజ్.