తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఈటెల చుట్టూ నడుస్తున్న పరిస్థితి ఉంది. భూ కబ్జా ఆరోపణలపై ఈటెలను మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేయడంతో మాజీ మంత్రి ఈటెల ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారారు.
మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేసిన తరువాత ఈటెల కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే.అయితే ఇక ఈటెలను రాజకీయంగా బలహీనపరచాలని ఈటెల స్వంత నియోజకవర్గమైన హుజురాబాద్ లో తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నారు కేసీఆర్.
ఇది ఒక వైపు ఉంచితే ఈటెల సరికొత్త రాజకీయానికి తెరదీస్తున్నారు.ఇటు కేసీఆర్ ను ఇరుకున పెట్టే విమర్శలు చేస్తూనే ఇటు ప్రతిపక్ష నేతలతో కూడా భేటీ అవుతున్న పరిస్థితి ఉంది.
అయితే ఇటీవల కాంగ్రెస్ నేతలతో ఈటెల రాజేందర్ భేటీ అయిన విషయం తెలిసిందే.ఆ భేటీనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టిందని చెప్పవచ్చు.
హుజురాబాద్ లో మాజీ మంత్రి ఈటెలకు రాజకీయ ప్రత్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డి ఈటెలపై పోటీ చేస్తూ వస్తున్న పరిస్థితి నెలకొంది.అయితే ఈటెలను కేసీఆర్ భర్తరఫ్ చేసిన తరువాత ఈటెలకు మద్దతుగా రేవంత్, భట్టి విక్రమార్క మాట్లాడిన విషయం తెలిసిందే.
అయితే ఈటెల త్వరలో పార్టీలో చేరుతున్నారనే ఊహగానాల నేపథ్యంలో ఈటెల వ్యవహారంపై పార్టీ వైఖరి ఏంటో తెలపాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ లేఖ రాసిన విషయం తెలిసిందే.అయితే తాజాగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈటెలపై కాంగ్రెస్ తరపు అభ్యర్థి పోటీలో ఉంటారని వ్యాఖ్యనించడం చూస్తుంటే ఈటెల వ్యవహారంలో నేతల మధ్య చీలిక వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.