అడవిలో అతి పెద్ద జంతువుగా ఏనుగుకు గుర్తింపు ఉంది.దీనికి సంబంధించిన వీడియోలకు నెట్టింట ఎంతో ఆదరణ ఉంటుంది.
ఇక ఏనుగులకు కోపం వస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.దాని ధాటికి అడవిలో సింహాలు కూడా బెంబేలెత్తిపోతుంటాయి.
అలాంటి ఏనుగుకు ఎవరూ ఎదురెళ్లేందుకు సాహసించరు.అలాంటి గజరాజులు అప్పుడప్పుడు సాగించే బీభత్సం అంతా ఇంతా కాదు.
పంట పొలాల దగ్గర లేదంటే ఇతరత్రా ప్లేసుల్లో అవి సాగించే బీభత్సానికి సంబంధించిన వార్తలు నిత్యం హల్ చల్ చేస్తూనే ఉంటాయి.
ఇక పోతే ఇప్పుడు కూడా ఓ ఏనుగు సృష్టించిన బీభత్సం గురించి తెలుసుకుందాం.
కేరళలోని తిరువిల్వామల విల్వద్రినాథ ఆలయంలో ఓ ఏనుగు ఈ బీభత్సం చేసింది.సాధారణంగా కేరళ అంటేనే అక్కడి గుడులలో ఏనుగులు ఉంటాయి.
పూజా కార్యక్రమాల సమయంలో వీటిని ప్రత్యేకంగా ఉపయోగిస్తుంటారు.ఇకపోతే ఈ ఆలయంలో చెందిన అదత్తు పరమ్ అక పానచెరి పరమేశ్వరం అనే ఏనుగు ఎప్పటి నుంచో పూజా కార్యక్రమాల్లో పాల్గొంటోంది.
ఇక తాజాగా జరిగిన పూజలో ఈ ఏనుగు కూడా పాల్గిందని తెలుస్తోంది.
అయితే పూజ జరుగుతున్న క్రమంలో ఒకేసారి తన శరీరాన్ని విదిల్చుతూ నానా రచ్చ చేసేసింది.ఇక పూజ కాబట్టి ఆలయ సిబ్బంది అయిన కునిసెరి స్వామినాథన్ అదే ఏనుగుపై కూర్చని ఉండగా ఆయన ఒక్కసారిగా కింద పడ్డారు.ఇక ఇలా కింద పడిన కునిసెరి స్వామినాథన్ మీద దాడి చేసేందుకు ఆ ఏనుగు ముందుకు రావడంతో అందరూ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు.
ఇక ఇదంతా కూడా అక్కడే ఉన్న కెమెరాల్లో రికార్డు కావడంతో ఇది కాస్త ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అయితే ఇందులో ఎలాంటి ప్రాణహాని జరగలేదు.